రాహుల్ గాంధీకి బాంబు బెదిరింపు లేఖ...
- November 18, 2022
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఇండోర్ చేరుకున్నారు. అయితే రాహుల్ గాంధీకి ప్రాణహానికి సంబంధించి బెదిరింపులు వచ్చాయి. బాంబులతో చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. జోడో యాత్ర సాగే మార్గంలోని ఓ స్వీట్ షాప్లో బెదిరింపు లేఖ వదిలి వెళ్లారు దుండగులు. ఈ లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. రాహుల్ గాంధీ భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. స్వీట్ షాపులో లేఖను వదిలి వెళ్లిన వ్యక్తి కోసం ఇండోర్ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది వెతుకుతున్నారు. జూని ఇండోర్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నారు పోలీసులు.
కాగా, నవంబర్ 24న రాహుల్ గాంధీ ఇండోర్లోని ఖల్సా స్టేడియంలో రాత్రి విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో బాంబ్ బెదిరింపుల లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, ఈ లేఖను ఎవరో తుంటరి వాళ్లు చేసిన పనిగా భావిస్తున్నారు పోలీసులు. అయినప్పటికీ పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారు అధికారులు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది.. విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







