రాహుల్ గాంధీకి బాంబు బెదిరింపు లేఖ...
- November 18, 2022
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఇండోర్ చేరుకున్నారు. అయితే రాహుల్ గాంధీకి ప్రాణహానికి సంబంధించి బెదిరింపులు వచ్చాయి. బాంబులతో చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. జోడో యాత్ర సాగే మార్గంలోని ఓ స్వీట్ షాప్లో బెదిరింపు లేఖ వదిలి వెళ్లారు దుండగులు. ఈ లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. రాహుల్ గాంధీ భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. స్వీట్ షాపులో లేఖను వదిలి వెళ్లిన వ్యక్తి కోసం ఇండోర్ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది వెతుకుతున్నారు. జూని ఇండోర్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నారు పోలీసులు.
కాగా, నవంబర్ 24న రాహుల్ గాంధీ ఇండోర్లోని ఖల్సా స్టేడియంలో రాత్రి విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో బాంబ్ బెదిరింపుల లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, ఈ లేఖను ఎవరో తుంటరి వాళ్లు చేసిన పనిగా భావిస్తున్నారు పోలీసులు. అయినప్పటికీ పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారు అధికారులు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది.. విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







