175 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన ఒమన్ సుల్తాన్

- November 18, 2022 , by Maagulf
175 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించిన ఒమన్ సుల్తాన్

మస్కట్: ఒమన్ 52వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 175 మంది ఖైదీలకు సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ క్షమాభిక్షను ప్రసాదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్షమాభిక్ష పొందిన 175 మందిలో 65 మంది విదేశీయులు ఉన్నారని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపారు. 52వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఖైదీల కుటుంబాలు చేసుకున్న అభ్యర్థనలను హిస్ మెజెస్టి, ది సుప్రీం కమాండర్ సుల్తాన్ పరిగణనలోకి తీసుకొని క్షమాభిక్ష ప్రసాదించారని ఆర్పోపీ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com