సోనూసూద్ కు అరుదైన గౌరవం...
- November 22, 2022
ముంబై: రీల్ లైఫ్ లో విలన్ గా అందర్నీ భయపెట్టే సోనూసూద్.. రియల్ లైఫ్ లో మాత్రం అందరికి ఆపద్బాంధవుడు అవుతున్నాడు. కరోనా కష్ట సమయంలో భయంతో ఉన్నవారికి తానే ధైర్యం అయ్యాడు. సాయం అడగని వారి కష్టాన్ని కూడా తెలుసుకొని చెయ్యి అందిస్తూ ఎంతమందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఎవరు, ఎక్కడి వారు అనేది చూడకుండా అందుతున్న సోనూ సాయం చూసిన జనం అతని వద్దకు కదిలివెళుతున్నారు.
ఈ రియల్ హీరో తన సేవ కారిక్రమాలని కోవిడ్ సమయంలోనే కాదు ఆ తరువాత కూడా ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ను స్థాపించి దేశ నలుమూలలకు తన సేవలను అందిస్తున్నారు. అతని సేవ భావం చూసిన జనం అతనికి అభిమానులు అయిపోతున్నారు. కాగా సొసైటీ అచీవర్స్ అవార్డ్స్ 2022 వేడుకలు, సోమవారం రాత్రి తాజ్ శాంతాక్రూజ్లో జరిగిని. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం సోనూసూద్ సేవా గుణాన్ని గుర్తించి అతని ‘నేషన్స్ ప్రైడ్’ అవార్డుతో సత్కరించింది.
ఈ అవార్డుని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చేతులు మీదగా సోనూ అందుకున్నాడు. ఇక సోనూసూద్ మాట్లాడుతూ.. “వెనకబడిన కుటుంబాలకి ఆరోగ్యకరమైన ఒక మంచి జీవితాన్ని అందించడమే నా లక్ష్యం. ఈరోజు సూద్ ఛారిటీ ఫౌండేషన్స్ ప్రయత్నాలకు ఇంతటి గుర్తింపు లభిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను” అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఈ కారిక్రమానికి హేమ మాలిని, తమనా భాటియా, మధుర్ భండార్కర్ మరియు ఫరాఖాన్ సినీప్రముఖులు కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







