పెళ్లి పేరిట విదేశీ మహిళకు కుచ్చుటోపీ: ముగ్గురికి జైలు శిక్ష
- November 28, 2022
యూఏఈ: పెళ్లి పేరిట మోసం అబుధాబికి చెందిన ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిపై ఓ విదేశీ మహిళ వేసిన సివిల్ దావాను కోర్టు సమర్థించింది. కేసును విచారించిన అబుధాబి కుటుంబ, సివిల్ అడ్మినిస్ట్రేటివ్ కేసుల కోర్టు ఆ మహిళ నుండి తీసుకున్న 1.4 మిలియన్ దిర్హామ్లకు అదనంగా మరో 20,000 దిర్హామ్లను ఆమె అనుభవించిన నష్టానికి పరిహారంగా చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. అలాగే మహిళ న్యాయపరమైన ఖర్చులు కూడా చెల్లించాలని నిందితులను కోర్టు ఆదేశించింది.
కోర్టు ఫైల్స్ ప్రకారం.. అబుదాబిలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తరపున ఇద్దరు మహిళలు విదేశీ మహిళను వివాహ కోసం సంప్రదించారని తెలిపింది. వారు ఆమెతో కమ్యూనికేట్ కావాడానికి తప్పుడు గుర్తింపును ఉపయోగించారు. అబుధాబిలో పెళ్లికి ఏర్పాట్లు చేసేందుకు నిందితులు తన నుంచి 1.4 మిలియన్ దిర్హామ్లు వసూలు చేశారు. అనంతరం వారి నుంచి స్పందన లేకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించింది. ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. అబుధాబి క్రిమినల్ కోర్టు గతంలో ముగ్గురు నిందితులకు మూడు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే మొదటి ముద్దాయి అయిన వ్యక్తిని జైలు శిక్ష అనుభవించిన తర్వాత దేశం నుండి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. అనంతరం బాధిత మహిళ ముగ్గురు నిందితులపై సివిల్ దావా వేసింది.
తాజా వార్తలు
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!









