పెళ్లి పేరిట విదేశీ మహిళకు కుచ్చుటోపీ: ముగ్గురికి జైలు శిక్ష
- November 28, 2022
యూఏఈ: పెళ్లి పేరిట మోసం అబుధాబికి చెందిన ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిపై ఓ విదేశీ మహిళ వేసిన సివిల్ దావాను కోర్టు సమర్థించింది. కేసును విచారించిన అబుధాబి కుటుంబ, సివిల్ అడ్మినిస్ట్రేటివ్ కేసుల కోర్టు ఆ మహిళ నుండి తీసుకున్న 1.4 మిలియన్ దిర్హామ్లకు అదనంగా మరో 20,000 దిర్హామ్లను ఆమె అనుభవించిన నష్టానికి పరిహారంగా చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. అలాగే మహిళ న్యాయపరమైన ఖర్చులు కూడా చెల్లించాలని నిందితులను కోర్టు ఆదేశించింది.
కోర్టు ఫైల్స్ ప్రకారం.. అబుదాబిలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తరపున ఇద్దరు మహిళలు విదేశీ మహిళను వివాహ కోసం సంప్రదించారని తెలిపింది. వారు ఆమెతో కమ్యూనికేట్ కావాడానికి తప్పుడు గుర్తింపును ఉపయోగించారు. అబుధాబిలో పెళ్లికి ఏర్పాట్లు చేసేందుకు నిందితులు తన నుంచి 1.4 మిలియన్ దిర్హామ్లు వసూలు చేశారు. అనంతరం వారి నుంచి స్పందన లేకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించింది. ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. అబుధాబి క్రిమినల్ కోర్టు గతంలో ముగ్గురు నిందితులకు మూడు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే మొదటి ముద్దాయి అయిన వ్యక్తిని జైలు శిక్ష అనుభవించిన తర్వాత దేశం నుండి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. అనంతరం బాధిత మహిళ ముగ్గురు నిందితులపై సివిల్ దావా వేసింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







