కువైట్ సంచలన నిర్ణయం..
- December 03, 2022
కువైట్ సిటీ: కువైట్ విద్యాశాఖ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. స్కూల్స్లో మెటల్ థర్మోస్ వాటర్ బాటిల్స్ను బ్యాన్ చేసింది. దీనికి కారణం ఇటీవల అక్కడి ఓ స్కూల్లో జరిగిన ఒక సంఘటన. ఓ ఎలిమెంటరీ విద్యార్థి తోటి విద్యార్థిపై మెటల్ థర్మోస్తో దాడికి పాల్పడ్డాడు. దాంతో బాధిత విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఐసీయూలో ఉన్నాడట. ఈ ఘటన నేపథ్యంలోనే విద్యామంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో మెటల్ థర్మోస్ వాటర్ బాటిల్స్ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. మొదట అబ్బాయిలకు మాత్రమే ఇలా ఈ వాటర్ బాటిళ్లను స్కూళ్లకు తీసుకురావడాన్ని అధికారులు నిషేధించారు. కానీ ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని విద్యార్థులందరికీ (అబ్బాయిలు, అమ్మాయిలకి కూడా) అమలు చేయాలని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశించింది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!