5 పైసల కాయిన్ పట్టుకొచ్చి ఇస్తే… రూ.400 శాకాహార భోజనం ఫ్రీ..
- December 03, 2022
విజయవాడ: భారత్ లో ఒకప్పుడు 5 పైసల కాయిన్స్ చలామణీలో ఉండేవి. ఇప్పుడు ఆ కాయిన్స్ కనపడడమే గగనమైపోయింది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఓ రెస్టారెంటు ఓ ఆఫర్ పెట్టి, 5 పైసల కాయిన్ తీసుకొస్తే రూ.400 విలువచేసే శాకాహార భోజనం ఉచితంగా తినొచ్చని పేర్కొంది. 35 రకాల వంటకాలు రుచిచూడొచ్చని ప్రకటించింది. 5 పైసల కాయిన్స్ ఇప్పట్లో ఎవరి దగ్గర ఉంటాయని అందరూ అనుకున్నారు. అయితే, ఆ రెస్టారెంటుకు 5 పైసల కాయిన్స్ పట్టుకుని వచ్చిన వారిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ఆ హోటల్ కు భారీగా జనాలు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 5 పైసలు పట్టుకుని రాజ్ భోగ్ రెస్టారెంటు ముందుకు వచ్చిన జనాలు లోపలికి వెళ్లేందుకు ఎగబడ్డారు. ఇంత మంది భోజనం చేసేందుకు వస్తారని తాము ఊహించలేదని ఆ రెస్టారెంటు యజమాని మీడియాకు తెలిపారు.
దాదాపు 300-400 మంది కస్టమర్లు వస్తారని తాము అనుకుంటే 1,000 మంది కంటే ఎక్కువ కస్టమర్లు వచ్చారని చెప్పారు. తాము మొదట వచ్చిన 50 మందికి మాత్రమే 5 పైసలకు భోజనం అందించామని, మిగతా అందరికీ సగం ధరకే (రూ.200) ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు తమ రెస్టారెంటు బాగా ఫేమస్ అయిపోయిందని సంబరపడిపోయారు. రాజస్థానీ, గుజరాతీ, ఉత్తర భారత తాలీని తాము వడ్డించామని చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!