పనిమనుషులను నియమిస్తానని మోసం.. మహిళ అరెస్ట్

- December 08, 2022 , by Maagulf
పనిమనుషులను నియమిస్తానని మోసం.. మహిళ అరెస్ట్

దుబాయ్: పని మనుషులను ఏర్పాటు చేస్తానని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడిన 43 ఏళ్ల ఆసియా మహిళపై దుబాయ్‌లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ ప్రారంభించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. Dh 6,000 - Dh10,000 మధ్య కమీషన్ తీసుకొని పనిమనుషులను ఏర్పాటు చేస్తానని సదరు మహిళ ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రకటన చూసిన ఓ వ్యక్తి పనిమనిషిని ఏర్పాటు చేయాలని సంప్రదించగా.. 6,000 దిర్హామ్ లను మహిళ తీసుకుంది. డబ్బు ఇచ్చిన రెండు రోజుల తరువాత ఆమె తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులోకి రాలేదు. దీంతో సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. గతంలోనూ ఇతరులను ఇలాగే మోసం చేసిందని తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com