పనిమనుషులను నియమిస్తానని మోసం.. మహిళ అరెస్ట్
- December 08, 2022
దుబాయ్: పని మనుషులను ఏర్పాటు చేస్తానని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడిన 43 ఏళ్ల ఆసియా మహిళపై దుబాయ్లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ ప్రారంభించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. Dh 6,000 - Dh10,000 మధ్య కమీషన్ తీసుకొని పనిమనుషులను ఏర్పాటు చేస్తానని సదరు మహిళ ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రకటన చూసిన ఓ వ్యక్తి పనిమనిషిని ఏర్పాటు చేయాలని సంప్రదించగా.. 6,000 దిర్హామ్ లను మహిళ తీసుకుంది. డబ్బు ఇచ్చిన రెండు రోజుల తరువాత ఆమె తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులోకి రాలేదు. దీంతో సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. గతంలోనూ ఇతరులను ఇలాగే మోసం చేసిందని తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







