డిసెంబర్ 12న శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా విడుదల

- December 09, 2022 , by Maagulf
డిసెంబర్ 12న శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా విడుదల

తిరుమల: వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను ఈ నెల 12న మధ్యాహ్నం 03:00 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ సేవా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

అలాగే 2023 జనవరి నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జిత సేవా టిక్కెట్లకు ఆన్‌లైన్‌ లక్కీ డిప్ నమోదు ప్రక్రియ ఈ నెల 12న ఉదయం పది గంటల నుంచి డిసెంబర్ 14న ఉదయం పది గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ పద్ధతిలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారిలోంచి లక్కీడీప్ ద్వారా విజేతలను ఎంపిక చేసి టిక్కెట్లు కేటాయిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి, ఆర్జిత సేవలను బుక్ చేసుకోవచ్చని టీటీడీ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com