సీనియర్ సిటిజన్లకు రైల్వే శాఖ శుభవార్త...
- December 12, 2022
న్యూ ఢిల్లీ: సీనియర్ సిటిజన్లకు కేంద్ర రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పనుంది.గతంలో రద్దు చేసిన టిక్కెట్లపై రాయితీని తిరిగి పునరుద్ధరించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. రెండేళ్ల క్రితం కోవిడ్ సమయంలో రైళ్లు చాలా కాలం రద్దైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంతకాలం రైళ్లు పాక్షికంగానే నడిచాయి.
అయితే, ఆ సమయంలో నష్టాల నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ అనేక విభాగాల్లో టిక్కెట్లపై ఇచ్చే రాయితీని ఎత్తేసింది. వృద్ధులకు ఇచ్చే రాయితీని కూడా తొలగించింది. దీనిపై అప్పట్లోనే కేంద్రంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. తర్వాత వృద్ధులకు ఇచ్చే రాయితీని పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. కానీ, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని పార్లమెంటులో నలుగురు ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. ‘‘ఇటీవల ఈ అంశంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ ఏడాది ఆగష్టు 4న ఒక నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం సీనియర్ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరించాలని సూచించింది.
స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీల్లో రాయితీ ఇవ్వాలని సూచించింది. ప్రస్తుతం ప్యాసింజర్ల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా వెంటనే రాయితీ అమలు చేయాలని సూచించింది’’ అని మంత్రి ప్రకటించారు. దీంతో త్వరలోనే కేంద్రం రాయితీని పునరుద్ధరించే అవకాశాలున్నాయి. కాగా, 2019లో ప్రయాణికులకు రూ.59,837 కోట్ల రాయితీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికీ దివ్యాంగులు, రోగులు, విద్యార్థులకు రాయితీ కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







