నిర్మాణంలో జాప్యం..BD50,000 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం
- December 18, 2022
బహ్రెయిన్: కాంట్రాక్ట్పై సంతకం చేసిన ఏడాదిన్నర అయినా విల్లా ప్రాజెక్ట్ను పూర్తిచేయని నిర్మాణ సంస్థకు బహ్రెయిన్ కోర్టు మొట్టికాయలు వేసింది. క్లయింట్కు BD50,000 పరిహారం చెల్లించాలని కంపెనీని ఆరవ హై సివిల్ కోర్ట్ ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. 2020లో BD125,400 విలువ చేసే ప్రాజెక్ట్ కోసం ఓ వ్యక్తి BD44,819 చెల్లించాడు. డబ్బులు చెల్లించి 18 నెలలు అయినా నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో నిర్మాణ వ్యయం పెరిగి తనకు భారీగా నష్టం వచ్చిందని పిటిషన్ దారుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు నియమించిన ఇంజినీరింగ్ నిపుణుడు నిర్మాణంలో ఏర్పడిన జాప్యం కారణంగా నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని దాంతో విల్లా కొన్న వ్యక్తికి నష్టం జరిగిందని కోర్టుకు నివేదికను సమర్పించారు. నిపుణుల నివేదికను ఉటంకిస్తూ, పూర్తయిన పనిలో నిర్మాణ సంస్థ అనేక లోపాలు, లోటుపాట్లను చేసిందని కోర్టు పేర్కొంది. విల్లా కొనుగోలు ఒప్పందంలో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఎటువంటి వ్యవధిని పేర్కొనలేదని, అయితే సాధారణంగా మూడు నుంచి 12 నెలల సాధారణ కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కోర్టు అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







