నిర్మాణంలో జాప్యం..BD50,000 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం

- December 18, 2022 , by Maagulf
నిర్మాణంలో జాప్యం..BD50,000 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం

బహ్రెయిన్: కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన ఏడాదిన్నర అయినా విల్లా ప్రాజెక్ట్‌ను పూర్తిచేయని నిర్మాణ సంస్థకు బహ్రెయిన్ కోర్టు మొట్టికాయలు వేసింది. క్లయింట్‌కు BD50,000 పరిహారం చెల్లించాలని కంపెనీని ఆరవ హై సివిల్ కోర్ట్ ఆదేశించింది.  కోర్టు ఫైల్స్ ప్రకారం.. 2020లో BD125,400 విలువ చేసే ప్రాజెక్ట్ కోసం ఓ వ్యక్తి BD44,819 చెల్లించాడు. డబ్బులు చెల్లించి 18 నెలలు అయినా నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో నిర్మాణ వ్యయం పెరిగి తనకు భారీగా నష్టం వచ్చిందని పిటిషన్ దారుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు నియమించిన ఇంజినీరింగ్ నిపుణుడు నిర్మాణంలో ఏర్పడిన జాప్యం కారణంగా నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని దాంతో విల్లా కొన్న వ్యక్తికి నష్టం జరిగిందని కోర్టుకు నివేదికను సమర్పించారు. నిపుణుల నివేదికను ఉటంకిస్తూ, పూర్తయిన పనిలో నిర్మాణ సంస్థ అనేక లోపాలు, లోటుపాట్లను చేసిందని కోర్టు పేర్కొంది. విల్లా కొనుగోలు ఒప్పందంలో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఎటువంటి వ్యవధిని పేర్కొనలేదని, అయితే సాధారణంగా మూడు నుంచి 12 నెలల సాధారణ కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కోర్టు అభిప్రాయపడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com