నిర్మాణంలో జాప్యం..BD50,000 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం
- December 18, 2022
బహ్రెయిన్: కాంట్రాక్ట్పై సంతకం చేసిన ఏడాదిన్నర అయినా విల్లా ప్రాజెక్ట్ను పూర్తిచేయని నిర్మాణ సంస్థకు బహ్రెయిన్ కోర్టు మొట్టికాయలు వేసింది. క్లయింట్కు BD50,000 పరిహారం చెల్లించాలని కంపెనీని ఆరవ హై సివిల్ కోర్ట్ ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. 2020లో BD125,400 విలువ చేసే ప్రాజెక్ట్ కోసం ఓ వ్యక్తి BD44,819 చెల్లించాడు. డబ్బులు చెల్లించి 18 నెలలు అయినా నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో నిర్మాణ వ్యయం పెరిగి తనకు భారీగా నష్టం వచ్చిందని పిటిషన్ దారుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు నియమించిన ఇంజినీరింగ్ నిపుణుడు నిర్మాణంలో ఏర్పడిన జాప్యం కారణంగా నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని దాంతో విల్లా కొన్న వ్యక్తికి నష్టం జరిగిందని కోర్టుకు నివేదికను సమర్పించారు. నిపుణుల నివేదికను ఉటంకిస్తూ, పూర్తయిన పనిలో నిర్మాణ సంస్థ అనేక లోపాలు, లోటుపాట్లను చేసిందని కోర్టు పేర్కొంది. విల్లా కొనుగోలు ఒప్పందంలో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఎటువంటి వ్యవధిని పేర్కొనలేదని, అయితే సాధారణంగా మూడు నుంచి 12 నెలల సాధారణ కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కోర్టు అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!







