స్కూలు బస్సులు ఢీ.. 15 మంది విద్యార్థులు మృతి
- December 21, 2022
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది స్కూలు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని నోని జిల్లాలో బుధవారం రెండు బస్సులు ఢీ కొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బిస్నాపూర్-ఖోపుం రోడ్డులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఒక బస్సు కంట్రోల్ తప్పిందట. అదే సమయంలో రెండు బస్సులు ఢీకొట్టుకున్నట్లు స్థానిక సాక్షులు తెలిపారు. ఈ రెండు బస్సులు యారిపోక్లోని తంబల్ను హైయర్ సెకండరీ పాఠశాలకు చెందినవని, ఇవి రెండు విద్యార్థుల్ని ఖోపుం ప్రాంతానికి విహారయాత్రకు తీసుకెళ్తున్నాయని స్థానిక పోలీసు అధికారి తెలిపారు.
అనేక మంది విద్యార్థులు ఈ ప్రమాదంలో గాయపడ్డారని, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో కొందరు తీవ్ర గాయాల మధ్య చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. అయితే పరిస్థితి చూస్తుంటే మరణాల సంఖ్య మరింతకు పెరగొచ్చనే ఆందోళనను స్థానికులు వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు









