స్కూలు బస్సులు ఢీ.. 15 మంది విద్యార్థులు మృతి
- December 21, 2022
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది స్కూలు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని నోని జిల్లాలో బుధవారం రెండు బస్సులు ఢీ కొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బిస్నాపూర్-ఖోపుం రోడ్డులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఒక బస్సు కంట్రోల్ తప్పిందట. అదే సమయంలో రెండు బస్సులు ఢీకొట్టుకున్నట్లు స్థానిక సాక్షులు తెలిపారు. ఈ రెండు బస్సులు యారిపోక్లోని తంబల్ను హైయర్ సెకండరీ పాఠశాలకు చెందినవని, ఇవి రెండు విద్యార్థుల్ని ఖోపుం ప్రాంతానికి విహారయాత్రకు తీసుకెళ్తున్నాయని స్థానిక పోలీసు అధికారి తెలిపారు.
అనేక మంది విద్యార్థులు ఈ ప్రమాదంలో గాయపడ్డారని, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో కొందరు తీవ్ర గాయాల మధ్య చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. అయితే పరిస్థితి చూస్తుంటే మరణాల సంఖ్య మరింతకు పెరగొచ్చనే ఆందోళనను స్థానికులు వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







