భారత్ లోకి ప్రవేశించిన బిఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్..
- December 21, 2022
చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించింది. డ్రాగన్ కంట్రీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. చైనాలో కరోనా వ్యాప్తికి బిఎఫ్ 7 వేరియంట్ కారణమైంది. బిఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. గుజరాత్, ఒడిశాలో కేసులను గుర్తించారు.
గుజరాత్ లోని వడోదరలో ఓ ఎన్ఆర్ఐ మహిళకి ఒమిక్రాన్ బిఎఫ్ 7 వేరియంట్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో సదరు మహిళతో పాటు మరో ముగ్గురిని ఐసోలేషన్ కి తరలించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఎయిర్ పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించింది. విదేశీ ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
ఇప్పటి వరకు భారత్ లో మూడు బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులను అధికార వర్గాలు గుర్తించాయి.గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒక కేసు నమోదయిందని అధికారి పేర్కొన్నారు. భారత్ లో తొలిసారి ఈ వేరియంట్ ను గుర్తించారు. గత అక్టోబర్ నెలలో గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







