ఒమన్ నుండి సైకిల్ యాత్ర ప్రారంభించిన భారతీయ బ్లాగర్
- December 22, 2022
మస్కట్: అరబ్ ప్రపంచం, ఆఫ్రికా ఖండాన్ని సైకిల్పై అధిగమించే లక్ష్యంతో 23 ఏళ్ల భారతీయ బ్లాగర్ అరుణిమా ఒమన్ నుండి రెండేళ్ల పర్యటనను డిసెంబర్ 14న ప్రారంభించారు. అంతకుముందు ఆమె భారతదేశంలోని ముంబై నుండి మస్కట్కు చేరుకున్నది. అరుణిమ పది రోజుల్లో కేరళ నుండి ముంబైకి 2,500 కి.మీ సైకిల్ తొక్కి చేరుకున్నది. యూట్యూబ్లో 126,000 మంది, ఇన్స్టాగ్రామ్లో 104,000 మంది ఫాలోవర్లతో సోషల్ మీడియాలో బ్యాక్ప్యాకర్ అరుణిమ పేరుతో రాణిస్తున్నది. అరుణిమ చాలా సంవత్సరాలుగా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు. తనకు చిన్నప్పటి నుండి ప్రయాణాలు అంటే ఇష్టం. దీన్ని ఇప్పుడుతన అభిరుచిగా మార్చుకున్నారు. తాను వెళ్లే ప్రాంతంలోని విశేషాలను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వివరిస్తారు. ఒమన్లో ఆమె ఖురియాత్, బిమ్మా సింఖోల్, అమెరత్ హైట్స్, సాల్ స్టెప్స్, ముత్రా సౌక్లతో సహా అనేక ప్రదేశాలకు సైకిల్ పై వెళ్లింది. యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, ఈజిప్ట్లకు వెళతానని అరుణిమ చెప్పారు. ఆమె బ్యాక్ప్యాక్లో టెంట్, గోప్రోతో సహా అన్ని అవసరమైన వస్తువులు ఉంటాయి. తన ప్రయాణంలో షూట్ చేసిన వీడియోలను ఫోన్లో ఎడిట్ చేసి అప్ లోడ్ చేస్తుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







