రెండు గంటల్లోనే 300 ఉల్లంఘనలు నమోదు
- December 23, 2022
కువైట్: షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని వివిధ కార్ల రిపేర్ గ్యారేజీల వద్ద ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తనిఖీ ప్రచారాన్ని ప్రారంభించింది. కేవలం రెండు గంటల్లోనే సుమారు 300 ఉల్లంఘనలను జారీ చేసినట్లు ట్రాఫిక్ డిపార్టుమెంట్ తెలిపింది. బ్రిగేడియర్ జనరల్ మెషాల్ అల్-సువైజీ నేతృత్వంలో మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, రక్షణ శాఖ తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ సూచనల ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిని పర్యవేక్షించడానికి, ప్రధానంగా మరమ్మతుల గురించి సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. రెండు గంటల తనిఖీలో అధికారులు 300 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేశారని, నివాస చట్టాన్ని ఉల్లంఘించిన నలుగురిని అరెస్టు చేసినట్లు ట్రాఫిక్ డిపార్టుమెంట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







