రెండు గంటల్లోనే 300 ఉల్లంఘనలు నమోదు
- December 23, 2022
కువైట్: షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని వివిధ కార్ల రిపేర్ గ్యారేజీల వద్ద ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తనిఖీ ప్రచారాన్ని ప్రారంభించింది. కేవలం రెండు గంటల్లోనే సుమారు 300 ఉల్లంఘనలను జారీ చేసినట్లు ట్రాఫిక్ డిపార్టుమెంట్ తెలిపింది. బ్రిగేడియర్ జనరల్ మెషాల్ అల్-సువైజీ నేతృత్వంలో మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, రక్షణ శాఖ తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ సూచనల ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిని పర్యవేక్షించడానికి, ప్రధానంగా మరమ్మతుల గురించి సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. రెండు గంటల తనిఖీలో అధికారులు 300 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేశారని, నివాస చట్టాన్ని ఉల్లంఘించిన నలుగురిని అరెస్టు చేసినట్లు ట్రాఫిక్ డిపార్టుమెంట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







