రెండు గంటల్లోనే 300 ఉల్లంఘనలు నమోదు

- December 23, 2022 , by Maagulf
రెండు గంటల్లోనే 300 ఉల్లంఘనలు నమోదు

కువైట్: షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని వివిధ కార్ల రిపేర్ గ్యారేజీల వద్ద ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ తనిఖీ ప్రచారాన్ని ప్రారంభించింది. కేవలం రెండు గంటల్లోనే సుమారు 300 ఉల్లంఘనలను జారీ చేసినట్లు ట్రాఫిక్ డిపార్టుమెంట్ తెలిపింది. బ్రిగేడియర్ జనరల్ మెషాల్ అల్-సువైజీ నేతృత్వంలో మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, రక్షణ శాఖ తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ సూచనల ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిని పర్యవేక్షించడానికి, ప్రధానంగా మరమ్మతుల గురించి సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. రెండు గంటల తనిఖీలో అధికారులు 300 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేశారని, నివాస చట్టాన్ని ఉల్లంఘించిన నలుగురిని అరెస్టు చేసినట్లు ట్రాఫిక్ డిపార్టుమెంట్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com