రద్దీగా ఉండే అపార్ట్మెంట్లు, విల్లాలకు dh1 మిలియన్ జరిమానా
- December 23, 2022యూఏఈ: అబుధాబి మునిసిపాలిటీలు, రవాణా శాఖ (DMT) నివాస ప్రాంతాలలో రద్దీని ఎదుర్కోవడానికి 'మీ ఇల్లు, మీ బాధ్యత' ప్రచారాన్ని ప్రారంభించింది. 2023 మొదటి త్రైమాసికంలో ప్రారంభమయ్యే తనిఖీ ప్రచారాలలో భాగంగా, ఉల్లంఘించిన వారికి 1 మిలియన్ దిర్హామ్ల వరకు జరిమానా విధించబడుతుంది. 2019 చట్టం నెం. 8 ప్రకారం, రెసిడెన్షియల్ యూనిట్ దాని విస్తీర్ణం, అందించిన సౌకర్యాలకు మించి ఉన్న సందర్భంలో రద్దీగా పరిగణించబడుతుందని పేర్కొంది. అబుధాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ సహకారంతో ప్రారంభించబడిన ఈ ప్రచారం, ఎమిరేట్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అధిక రద్దీ ప్రతికూల ప్రభావాల నుండి కమ్యూనిటీ సభ్యులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అబుధాబి మునిసిపాలిటీ తెలిపింది. పౌరులు, రియల్ ఎస్టేట్ యజమానులు, వ్యాపారాలందరూ ఒక నివాస యూనిట్కు వ్యక్తుల సంఖ్యను పరిమితం చేయడం ద్వారా చట్టాన్ని అనుసరించాలని, నివాస ప్రాంతాలకు దూరంగా గృహ కార్మికులను ఉంచాలని కోరింది. ఎమిరేట్లోని మూడు మునిసిపాలిటీల ఇన్స్పెక్టర్లచే తనిఖీ ప్రచారాలు నిర్వహించబడతాయని పేర్కొంది.
మునిసిపాలిటీలు, రవాణా శాఖలు తగ్గింపు పథకాన్ని కూడా ప్రకటించాయి. నిబంధనలు ఉల్లంఘించినవారు సెటిల్మెంట్ ఎంపిక తేదీ నుండి 60 రోజులకు మించని వ్యవధిలో జరిమానాలు చెల్లించినట్లయితే, ఉల్లంఘనకు పేర్కొన్న మొత్తం అడ్మినిస్ట్రేటివ్ జరిమానాలో 75 శాతం మాత్రమే చెల్లించాలని తెలిపాయి. అధిక రద్దీ, ఆక్యుపెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన సందర్భాలను నివేదించడానికి నివాసితులు 800555కు కాల్ చేయడం ద్వారా మునిసిపల్ సంస్థలను సంప్రదించవచ్చని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!