రేపు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి
- December 25, 2022
హైదరాబాద్: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 26 నుంచి 30 వరకు ద్రౌపది ముర్ము నగరంలోనే బస చేస్తారు. రాష్ట్రపతి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్ బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేస్తారు. నిలయంలోపల ఉన్న ఆరు భవనాలను, దీని బయట ఉన్న మరో 14 భవనాలను, చుట్టూ ఉన్న ప్రాంతాలు, ఉద్యానవనాల్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ప్రాంతంలో రోడ్లను మెరుగుపర్చడంతోపాటు, మంచి నీటి వసతి కల్పించారు. పాములు వంటి హానికర జీవులు రాష్ట్రపతి నిలయం, ఈ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ఇప్పటికే ఢిల్లీ నుంచి ఒక బృందం ఇక్కడికి వచ్చింది. రాష్ట్రపతి భద్రతసహా ఇతర ఏర్పాట్లను పరిశీలించింది. ప్రత్యేక బలగాలు ఈ ప్రాంతం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. బొల్లారం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక బలగాల ఆధ్వర్యంలో గట్టి భద్రత కొనసాగుతోంది.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







