వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్..
- December 28, 2022
వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్. డిసెంబర్ 31 తర్వాత పలు స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. దీనికి సంబంధించి వాట్సాప్ నుంచి ప్రకటన వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రతి సంవత్సరం పలు మొబైల్ ఫోన్లకు సపోర్ట్ను తొలగిస్తూ వస్తోంది వాట్సాప్. ఈ క్రమంలో ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి 49 ఫోన్లలో సేవలను నిలిపివేస్తోంది.
అయితే యూజర్లు వర్రీ కావాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని ఐఫోన్ మోడల్స్తో పాటు పలు అండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. పాత, ఔట్ డేటేడ్ ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అయ్యే మొబైల్ ఫోన్లపైనే వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. యాపిల్, శాంసంగ్ సహా పలు మొబైల్ ఫోన్లలో డిసెంబర్ 31 నుంచి వాట్సాప్ పని చేయదని తొలుత గిజ్చైనా రిపోర్ట్ చేసింది.
సాఫ్ట్వేర్ అప్డేట్, భద్రతాపరమైన లోపాల వల్ల 49 స్మార్ట్ఫోన్ మోడల్స్కు వాట్సాప్ సపోర్ట్ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. యూజర్లు ఈ మార్పును గమనించాలంది. డిసెంబర్ 31 తర్వాత నుంచి వాట్సాప్ కొత్తగా విడుదల చేసే ఫీచర్, సెక్యూరిటీ అప్డేట్లు ఇకపై ఆయా ఫోన్లకు రావని వెల్లడించింది.
వాట్సాప్ పేర్కొన్న 49 మోడల్స్లో ఎక్కువగా పాత వెర్షన్ మొబైల్స్ ఉన్నాయి. ఈ జాబితాలో ఐఫోన్ 5, 5సీతోపాటు శాంసంగ్ గెలాక్సీ సిరీస్లో కోర్, ఎస్2, ఎస్3 మినీ, ట్రెండ్ 2, ట్రెండ్ లైట్, ఎక్స్కవర్ 2, ఏస్2 మోడల్స్ ఉన్నాయి. ఇవికాకుండా హెచ్టీసీ డిజైర్, లెనోవా ఏ820, క్వాడ్ ఎక్స్ఎల్, ఎల్జీ ఎనాక్ట్, ఎల్జీ లూసిడ్ 2 మోడల్స్తోపాటు ఎల్జీ ఆప్టిమస్ సిరీస్, సోనీ ఎక్స్పిరీయా ఆర్క్ ఎస్, ఎక్స్పిరీయా మిరో, ఎక్స్పిరీయా నియో ఎల్, ఆర్కోస్ 53 ప్లాటినమ్, గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్ జెడ్టీఈ, గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ987 జెడ్టీఈ, వికో సింక్ ఫైవ్, వికో డార్క్నైట్ జెడ్టీ మోడల్స్లో డిసెంబర్ 31 తర్వాత వాట్సాప్ పని చేయదు.
సో.. ఒకసారి చెక్ చేసుకోండి.. మీరు ఏ ఫోన్ వాడుతున్నారో.. ఇప్పటికీ ఈ ఫోన్లను ఎవరైనా వాడుతుంటే.. కొత్త ఫోన్ కొనుగోలు చేయాలి. లేదా వాట్సాప్ వాడకం ఆపేయాలి. అంతకుమించి మరో ఆప్షనే లేదు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







