ముగిసిన మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు..
- December 30, 2022
గుజరాత్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ అనారోగ్యం కారణంగా ఈ తెల్లవారుజామున మృతి చెందగా.. ఆమె అంత్యక్రియలు గాంధీనగర్ శ్మశానవాటికలో ముగిసాయి. ఎంతో సింపుల్గా అంతిమయాత్ర నిర్వహించారు. తల్లి చనిపోయిందన్న విషయం తెలుసుకున్న వెంటనే ప్రధాని మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. అంతకుతముందు ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ పార్థివదేహన్ని యుఎన్ మెహతా ఆస్పత్రి నుంచి నేరుగా గాంధీనగర్లోని రైసన్ గ్రామంలోని బృందావన్ సొసైటీలో ఉంటున్న కుమారుడు పంకజ్ మోదీ ఇంటికి తీసుకొచ్చారు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని నేరుగా సోదరుడు పంకజ్ మోదీ ఇంటికి చేరుకుని తన తల్లికి నివాళులర్పించారు. కుమారులు, ముఖ్యమైన కుటుంబసభ్యులు సందర్శన అనంతరం అంత్యక్రియల కోసం వాహనంలో గాంధీనగర్లోని సెక్టార్ 30 శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో పాడెను ప్రధాని మోదీ మోసారు. ఆ తర్వాత వాహనంలో పార్థివదేహంతో పాటు ప్రధాని మోదీ శ్మశానవాటికకు చేరుకున్నారు. ఎటువంటి హడావుడి లేకుండా సాధారణంగా అంతిమయాత్ర నిర్వహించారు. అంత్యక్రియలకు తమ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారని, ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ వారి రాకకు అంతరాయం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







