ముగిసిన మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు..
- December 30, 2022
గుజరాత్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ అనారోగ్యం కారణంగా ఈ తెల్లవారుజామున మృతి చెందగా.. ఆమె అంత్యక్రియలు గాంధీనగర్ శ్మశానవాటికలో ముగిసాయి. ఎంతో సింపుల్గా అంతిమయాత్ర నిర్వహించారు. తల్లి చనిపోయిందన్న విషయం తెలుసుకున్న వెంటనే ప్రధాని మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. అంతకుతముందు ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ పార్థివదేహన్ని యుఎన్ మెహతా ఆస్పత్రి నుంచి నేరుగా గాంధీనగర్లోని రైసన్ గ్రామంలోని బృందావన్ సొసైటీలో ఉంటున్న కుమారుడు పంకజ్ మోదీ ఇంటికి తీసుకొచ్చారు. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని నేరుగా సోదరుడు పంకజ్ మోదీ ఇంటికి చేరుకుని తన తల్లికి నివాళులర్పించారు. కుమారులు, ముఖ్యమైన కుటుంబసభ్యులు సందర్శన అనంతరం అంత్యక్రియల కోసం వాహనంలో గాంధీనగర్లోని సెక్టార్ 30 శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో పాడెను ప్రధాని మోదీ మోసారు. ఆ తర్వాత వాహనంలో పార్థివదేహంతో పాటు ప్రధాని మోదీ శ్మశానవాటికకు చేరుకున్నారు. ఎటువంటి హడావుడి లేకుండా సాధారణంగా అంతిమయాత్ర నిర్వహించారు. అంత్యక్రియలకు తమ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారని, ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ వారి రాకకు అంతరాయం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!