భారత్ లో పలు నగరాలకు 'ఐఎస్ఐఎస్' ముప్పు

- June 18, 2015 , by Maagulf
భారత్ లో పలు నగరాలకు 'ఐఎస్ఐఎస్' ముప్పు

దేశంలో వివిధ నగరాలకు ఐఎస్ఐఎస్ ముప్పు పొంచి ఉందా అంటే ఉందనే అంటున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్ (ఐబీ) వర్గాలు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఐబీ దేశంలోని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. హైదరాబాద్ సహా ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, చెన్నై నగరాలపై దాడి చేసేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వ్యూహా రచన చేస్తున్నారని హెచ్చరించింది. రాష్ట్రాల్లో దాడులకు ఇప్పటికే 35 మంది ఉగ్రవాదులు రంగంలోకి దిగి సన్నాహాలు చేస్తున్నారని హెచ్చరించింది. దీంతో దేశంలోని విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లుతోపాటు నగరాల్లోని ప్రధాన కూడళ్లలో భద్రతను రాష్ట్ర ప్రభుత్వం మరింత కట్టదిట్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com