యూఎస్ కోర్టులో భారత సంతతి మహిళ.. జడ్జిగా ప్రమాణ స్వీకారం
- January 09, 2023
అమెరికా: భారత సంతతి మహిళ అమెరికాలో అరుదైన ఘనత సాధించారు. భారత సంతతికి చెందిన సిక్కు మహిళ మన్ ప్రీత్ మోనికా సింగ్ హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్టు జడ్జిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆమె టెక్సాస్ లోని హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్టులో జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు.
దీంతో అమెరికాలో ఈ ఘనత సాధించిన తొలి సిక్కు మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా తనకు దక్కిన అరుదైన గౌరవం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 1970లో మన్ ప్రీత్ తండ్రి అమెరికాకు వెలస వెళ్లారు. దీంతో ఆమె హ్యూస్టన్ లోనే పుట్టి పెరిగారు.
భర్త, ఇద్దరు పిల్లలతో ఆమె ఇప్పుడు బెల్లయిరేలో నివాసం ఉంటుంది. హ్యుస్టన్ లోనే ట్రయల్ న్యాయవాదిగా 20 ఏళ్లపాటు పని చేశారు. పౌర హక్కులకు సంబంధించిన పిటిషన్లతో పాటు జాతీయ స్థాయిలో వ్యవహారాలకు సంబంధించిన కేసులను కూడా ఆమె వాదించడం గమనార్హం.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









