బహ్రెయిన్ లో కనీస జీతం పెరుగుతుందా?
- January 10, 2023
బహ్రెయిన్ : బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ ప్రకారం.. బహ్రెయిన్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న 71% ప్రవాసులు నేడు నెలకు BD200 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. ప్రముఖ ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. అయితే నివేదికల ప్రకారం.. చమురు ద్వారా అత్యధిక ఆదాయాన్ని పొందుతున్న బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.
మరోవైపు బహ్రెయిన్ లో కనీస వేతనాన్ని చివరిగా జనవరి 1, 2015న సవరించారు. ప్రవాసులలో అధిక భాగం మంది తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. అదే సమయంలో కరోనా మహమ్మారి కారణంగా జీవన వ్యయాలు అధికం అయ్యాయి. కానీ ప్రైవేట్ రంగ సంస్థల లాభాలు పెరుగుతున్నా ఆ మేరకు కార్మికులకు జీతాలు మాత్రం పెరగడం లేదు. బహ్రెయిన్లో ప్రవాస కార్మికులకు కనీస వేతన చట్టం లేదు. కార్మికులకు చెల్లించే కనీస వేతన రేటు విషయంలో స్పష్టత లేదు. అయితే, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు మాత్రం BD300 రేటును నిర్ణయించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోసారి కనీస వేతన చట్టంలో మార్పులు జరిగే అవకాశం ఉందని లేబర్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..