బహ్రెయిన్ లో కనీస జీతం పెరుగుతుందా?
- January 10, 2023
బహ్రెయిన్ : బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ ప్రకారం.. బహ్రెయిన్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న 71% ప్రవాసులు నేడు నెలకు BD200 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. ప్రముఖ ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. అయితే నివేదికల ప్రకారం.. చమురు ద్వారా అత్యధిక ఆదాయాన్ని పొందుతున్న బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.
మరోవైపు బహ్రెయిన్ లో కనీస వేతనాన్ని చివరిగా జనవరి 1, 2015న సవరించారు. ప్రవాసులలో అధిక భాగం మంది తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. అదే సమయంలో కరోనా మహమ్మారి కారణంగా జీవన వ్యయాలు అధికం అయ్యాయి. కానీ ప్రైవేట్ రంగ సంస్థల లాభాలు పెరుగుతున్నా ఆ మేరకు కార్మికులకు జీతాలు మాత్రం పెరగడం లేదు. బహ్రెయిన్లో ప్రవాస కార్మికులకు కనీస వేతన చట్టం లేదు. కార్మికులకు చెల్లించే కనీస వేతన రేటు విషయంలో స్పష్టత లేదు. అయితే, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు మాత్రం BD300 రేటును నిర్ణయించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోసారి కనీస వేతన చట్టంలో మార్పులు జరిగే అవకాశం ఉందని లేబర్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







