హజ్ యాత్రికులకు శుభవార్త.. మూడేళ్ల తర్వాత పరిమితి ఎత్తివేత

- January 10, 2023 , by Maagulf
హజ్ యాత్రికులకు శుభవార్త.. మూడేళ్ల తర్వాత పరిమితి ఎత్తివేత

సౌదీ: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో మూడేళ్ల తర్వాత హజ్ యాత్రికుల సంఖ్యపై పరిమితులను సౌదీ ఎత్తివేసింది.  ఈ మేరకు హజ్, ఉమ్రా మంత్రి తౌఫిక్ అల్-రబియా రియాద్‌లో విలేకరులతో తెలిపారు. యాత్రికుల సంఖ్య, వయోపరిమితిపై పరిమితులు లేకుండా మహమ్మారికి ముందు ఉన్న స్థితికి చేరుకుందన్నారు. 2019 లో సుమారు 2.5 మిలియన్ల మంది హజ్ యాత్రలో పాల్గొన్నారు. మహమ్మారి కారణంగా తరువాతి రెండు సంవత్సరాల్లో ఈ సంఖ్యను భారీగా తగ్గించారు. 2022లో దాదాపు 900,000 మంది యాత్రికులు హజ్ యాత్రను పూర్తి చేశారు. విదేశాల నుండి 780,000 మంది యాత్రికులు పవిత్ర నగరాలైన మక్కా, మదీనాలను సందర్శించారు. కరోనా ఆంక్షల సమయంలో యాత్రికులు 65 ఏళ్లలోపు ఉండాలని,  కోవిడ్-19 వ్యాక్సిన్లు తీసుకోవడంతోపాటు కొవిడ్ నెగిటివ్ రిపోర్టు సమర్పించాలని షరతులు పెట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com