ఈ నెల 18న హైదరాబాద్ లో వన్డే మ్యాచ్..
- January 11, 2023
హైదరాబాద్: ఇటీవలే టీ20 మ్యాచ్కు వేదికైన హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో త్వరలో మరో అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతుంది.ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్తో ఇండియా సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
ఈ సిరీస్ తొలి వన్డే ఈ నెల 18న జరుగుతుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరగబోతుండటం విశేషం. ఈ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజహరుద్దీన్ వెల్లడించారు. ఈ మ్యాచ్కు సంబంధించిన టిక్కెట్ల విక్రయం ఈ నెల 13 నుంచి ప్రారంభమవుతుందని అజార్ తెలిపారు.
అజార్ తెలిపిన వివరాల ప్రకారం ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయం జరుగుతుంది. పేటీఎం యాప్లో ఈ టిక్కెట్ల విక్రయం ఉంటుంది. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో ఈ నెల 15–18 వరకు ఫిజికల్ టిక్కెట్లు తీసుకోవచ్చు. ఈ మ్యాచ్ కోసం ఈ నెల 14న న్యూజిలాండ్ టీమ్ హైదరాబాద్ వస్తుంది. 15న ప్రాక్టీస్ చేస్తారు. 15న శ్రీలంకతో టీమిండియాకు మ్యాచ్ ఉన్న దృష్ట్యా, 16న భారత జట్టు హైదరాబాద్ చేరుకుంటుంది. 17న ఇరు జట్లు ప్రాక్టీస్లో పాల్గొంటాయి.
తాజా వార్తలు
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్లోనే వాహన రిజిస్ట్రేషన్
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్
- TTD ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- మలేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్: సెమీస్కు పీవీ సింధు
- అబుదాబిలో 7 మోటార్బైక్ ప్రమాదాలు.. 9 మందికి గాయాలు..!!
- సల్మియా మార్కెట్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- బు సిల్లా ఇంటర్ఛేంజ్పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!







