ఖతార్ రైల్వే కార్మికులకు రమదాన్ బహుమానం
- June 18, 2015
2015 సంవత్సరంలో రమదాన్ మాస ప్రధాన్యతను పురస్కరించుకుని, 24,000కు పైగా శ్రామికులను కలిగిన ఖతార్ రైలు మార్గాల సంస్థ - 'ఖతార్ రైల్', తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీలోభాగంగా "this Ramadan - a simple thank you" కార్యక్రమాన్ని ప్రారంభించింది.
దీనిలో భాగంగా ఖతార్ రైలు అధికారులు, దోహా మెట్రోలొని వివిధ ప్రదేశాలలో పర్యటించి అక్కడి శ్రామికులతో ఉల్లాసంగా ఇఫ్తార్ విందులో పాల్గోవడమేకాక, వారి అవసరాలను గురించి కూడా తెలుసుకొంటారు.
ఈ విషయమై ఖతార్ రైల్ సీ. ఈ. ఓ. సాద్ అల్-మొహమ్మద్ మాట్లాడుతూ, మయ లక్ష్యాలను చేరుకోవడంలో ముఖ్య పాత్ర వహించే విదేశీ శ్రామికులకు కృతజ్ఞతలు తెలుపడం మా ముఖ్య ఉద్దేశం. మా చిరకాల భాగస్వాములైన శ్రామికులందరికి అవసరమైన సహాయ, సహకారాలనందించడంలో ఖతార్ రైల్ ముందుంటుందని మరోసారి తెలియచేస్తున్నాం - అన్నారు.
దీనితో పాటు, ఖతార్ రైల్ మానేజ్మెంటు, కార్మికులు, కాంట్రాక్టర్లు, భాగస్వాములతో కూడిన ఫుట్ బాల్ లీగ్ యొక్క 3వ ఎడిషన్ను కూడా విడుదల చేశారు. ఈ టోర్నమెంటు, మంచికి మారుపేరైన ఈ మాసంలో కతర్ రైల్ కుటుంబంలో క్రీడా స్ఫూర్తిని, ఐకమత్యాన్ని పెంపొందిస్తుందని ఆశిద్దాం!
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







