షార్జాలో 24-కిమీ సైకిల్ ట్రాక్ ప్రారంభం
- January 19, 2023
షార్జా: షార్జాలో 24 కిలోమీటర్ల మేర నిర్మించిన సైక్లింగ్ ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ ఆఫీస్ డైరెక్టర్ షేక్ సౌద్ బిన్ సుల్తాన్ బిన్ మహ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి అల్ బటాయే ఈ ప్రత్యేక సైకిల్ ట్రాక్ను ప్రారంభించారు. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు హిస్ హైనెస్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఆదేశాల మేరకు ఈ ట్రాక్ ను నిర్మించారు. షార్జా సెంట్రల్ రీజియన్లో 24 కిలోమీటర్ల ట్రాక్ ను మొత్తం 5 మీటర్ల వెడల్పుతో సైక్లింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని షేక్ సుల్తాన్ ఆదేశించారు. ట్రాక్లో కార్ పార్కింగ్లు, ప్రార్థన గదులు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. షార్జా డిపార్ట్మెంట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అండ్ సర్వే, షార్జా ఎమిరేట్లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ పర్యవేక్షణలో ఈ ట్రాక్ రూపకల్పన, నిర్మాణం జరిగింది. ప్రస్తుతం ట్రాక్ ప్రారంభం, చివరిలో 4 రెస్ట్రూమ్లను నిర్మించారు.సైకిల్ అద్దె-నిర్వహణ కేంద్రం, రెస్టారెంట్లు వంటివి త్వరలోనే ట్రాక్లో అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







