శ్రీవారి భక్తుల కోసం కొత్త యాప్ను విడుదల చేసిన టిటిడి
- January 27, 2023
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీవారి భక్తుల కోసం మొబైల్ యాప్ ను తీసుకువచ్చింది. దీనిపేరు ‘టిటి దేవస్థానమ్స్’. దీన్ని జియో ప్లాట్ ఫాంపై అభివృద్ధి చేశారు. టిటి దేవస్థానమ్స్ యాప్ సాయంతో తిరుమలలో స్వామివారి దర్శనం, గదుల బుకింగ్, ఆర్జిత సేవా టికెట్ల కొనుగోలు చేయవచ్చు.
ఈ యాప్ లో తిరుమల పుణ్యక్షేత్రం చరిత్ర, శ్రీవారి సేవల వివరాలు కూడా ఉంటాయి. అంతేకాదు, టిటిడి ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) కార్యక్రమాలను కూడా ఈ యాప్ లో వీక్షించవచ్చు.
టిటిడి గతంలో ‘గోవింద’ అనే యాప్ ను ప్రవేశపెట్టింది. ‘గోవింద’ యాప్ కు అప్ డేటెడ్ వెర్షనే ఈ ‘టిటి దేవస్థానమ్స్’ యాప్. ఇదివరకే ‘గోవింద’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారు దాన్ని అప్ డేట్ చేసుకుంటే, ‘టిటి దేవస్థానమ్స్’ యాప్ లోకి ఆటోమేటిగ్గా ఎంటరవుతారు. లేకపోతే, నేరుగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి ‘టిటి దేవస్థానమ్స్’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు టిటిడి వివరాలు తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







