కువైట్‌లో ప్రయాణ, పర్యాటక ఆదాయంలో 338 శాతం పెరుగుదల

- January 30, 2023 , by Maagulf
కువైట్‌లో ప్రయాణ, పర్యాటక ఆదాయంలో 338 శాతం పెరుగుదల

కువైట్: కువైట్‌లో ట్రావెల్ అండ్ టూరిజం రంగం 2022 సంవత్సరంలో దాదాపు 75 శాతం వ్యాపారం పెరిగింది. కువైట్‌లోని ట్రావెల్,  టూరిజం కార్యాలయాల ఆదాయం గత సంవత్సరంలో 338 శాతం పెరిగి 276.7 మిలియన్ దినార్‌లకు చేరుకుంది. అంతకుముందు 2020లో కరోనా సంక్షోభం సంభవించినప్పుడు 63.22 మిలియన్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అయితే, ఇది కరోనా సంక్షోభం కంటే ముందు 2019లో 308.18 మిలియన్ దినార్‌ల కంటే 10 శాతం తక్కువ కావడం గమనార్హం. పౌరులు, నివాసితులు దీర్ఘకాల అంతరాయం తర్వాత ప్రయాణించడానికి ఆసక్తిని చూపడంతో ఈ రంగానికి ఆదాయం పెరగడానికి కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రాబోయే జాతీయ సెలవు దినాలలో టర్కీ, దుబాయ్, కైరో ప్రాంతాలకు అధిక సంఖ్యలో ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com