కువైట్లో ప్రయాణ, పర్యాటక ఆదాయంలో 338 శాతం పెరుగుదల
- January 30, 2023
కువైట్: కువైట్లో ట్రావెల్ అండ్ టూరిజం రంగం 2022 సంవత్సరంలో దాదాపు 75 శాతం వ్యాపారం పెరిగింది. కువైట్లోని ట్రావెల్, టూరిజం కార్యాలయాల ఆదాయం గత సంవత్సరంలో 338 శాతం పెరిగి 276.7 మిలియన్ దినార్లకు చేరుకుంది. అంతకుముందు 2020లో కరోనా సంక్షోభం సంభవించినప్పుడు 63.22 మిలియన్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అయితే, ఇది కరోనా సంక్షోభం కంటే ముందు 2019లో 308.18 మిలియన్ దినార్ల కంటే 10 శాతం తక్కువ కావడం గమనార్హం. పౌరులు, నివాసితులు దీర్ఘకాల అంతరాయం తర్వాత ప్రయాణించడానికి ఆసక్తిని చూపడంతో ఈ రంగానికి ఆదాయం పెరగడానికి కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రాబోయే జాతీయ సెలవు దినాలలో టర్కీ, దుబాయ్, కైరో ప్రాంతాలకు అధిక సంఖ్యలో ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







