సందీప్ కిషన్ ఈ టైమ్లో అలా అనేశాడేంటీ.?
- January 30, 2023యంగ్ హీరో సందీప్ కిషన్కి కాలం కలిసి రావడం లేదు. మంచి టాలెంట్ వున్న హీరో. కానీ, కలిసొస్తేనే కదా నిలదొక్కుకునేది. అయినా కొత్త ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు సందీప్ కిషన్.
ఆ మధ్య ‘నిను వీడని నీడను నేనే’ అంటూ ఓ కొత్త ప్రయోగం చేశాడు ఒకింత ఫలించింది. ఆ తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ‘మైఖేల్’ అనే సినిమాతో వస్తున్నాడు. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ తదితర ప్రముఖ తమిళ నటీ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఫిబ్రవరి 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయ్. డబ్బింగ్ సినిమా.. స్ట్రెయిట్ సినిమా అనే బేధాలు మన తెలుగు సినిమాకి లేవు.. ఏ సినిమా అయినా కంటెంట్ బాగుంటే ఆదరిస్తారు మన తెలుగు వాళ్లు.
కానీ, తమిళోళ్లు అలా కాదు.. డబ్బింగ్ సినిమాని డబ్బింగ్ సినిమాలాగే చూస్తారంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు సినిమా ఫలితంపై ప్రభావం చూపించే ప్రమాదం వుంది కదా.. ఈ టైమ్లో సందీప్ కిషన్ ఎందుకిలా కెలుక్కున్నాడంటూ నెటిజన్లు వాపోతున్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు