బహ్రెయిన్ – ఖతార్ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం!
- February 02, 2023
బహ్రెయిన్ : 2017 తర్వాత మొదటిసారిగా బహ్రెయిన్ - ఖతార్ మధ్య విమాన సర్వీసులు త్వరలో పునఃప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రి మహ్మద్ అల్ కాబీ తెలియజేశారు. ఇరు దేశాల పౌర విమానయాన అధికారుల మధ్య సంప్రదింపుల మేరకు ఒప్పందం కుదిరిందని ఆయన నిన్న పార్లమెంటు సమావేశంలో ఎంపీలతో చెప్పారు. మిస్టర్ అల్ కాబీ మాట్లాడుతూ.. ప్రాంతీయంగా, మరిన్ని విదేశాలకు కొత్త విమానాలను ప్రవేశపెట్టే ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతానికి బహ్రెయిన్ నుండి 72 వాణిజ్య, కార్గో ఎయిర్లైన్స్ పని చేస్తున్నాయని, 2025 నాటికి 100కి చేరుకోవడం తమ లక్ష్యమన్నారు. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఇరు దేశాల పౌరుల ఆకాంక్షలను సాధించేందుకు 'సోదర దేశం ఖతార్'తో పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని హిస్ మెజెస్టి కింగ్ హమద్ స్పష్టం చేశారు. ఖతార్ అమీర్ షేక్ తమీన్ బిన్ హమద్ అల్ థానీతో హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మధ్య గత వారం ఫోన్ సంభాషణ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!







