బహ్రెయిన్ – ఖతార్ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం!
- February 02, 2023
బహ్రెయిన్ : 2017 తర్వాత మొదటిసారిగా బహ్రెయిన్ - ఖతార్ మధ్య విమాన సర్వీసులు త్వరలో పునఃప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రి మహ్మద్ అల్ కాబీ తెలియజేశారు. ఇరు దేశాల పౌర విమానయాన అధికారుల మధ్య సంప్రదింపుల మేరకు ఒప్పందం కుదిరిందని ఆయన నిన్న పార్లమెంటు సమావేశంలో ఎంపీలతో చెప్పారు. మిస్టర్ అల్ కాబీ మాట్లాడుతూ.. ప్రాంతీయంగా, మరిన్ని విదేశాలకు కొత్త విమానాలను ప్రవేశపెట్టే ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతానికి బహ్రెయిన్ నుండి 72 వాణిజ్య, కార్గో ఎయిర్లైన్స్ పని చేస్తున్నాయని, 2025 నాటికి 100కి చేరుకోవడం తమ లక్ష్యమన్నారు. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఇరు దేశాల పౌరుల ఆకాంక్షలను సాధించేందుకు 'సోదర దేశం ఖతార్'తో పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని హిస్ మెజెస్టి కింగ్ హమద్ స్పష్టం చేశారు. ఖతార్ అమీర్ షేక్ తమీన్ బిన్ హమద్ అల్ థానీతో హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మధ్య గత వారం ఫోన్ సంభాషణ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







