యూఏఈలో ఉచితంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్లు
- February 03, 2023
యూఏఈ: బ్రెస్ట్ క్యాన్సర్ను అరికట్టడం, అవగాహన పెంచడమే లక్ష్యంగా పింక్ కారవాన్ రైడ్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా యూఏఈలో ఉచితంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్లు చేస్తుంది. ఏడు రోజుల జాతీయ రైడ్లో మొబైల్ క్లినిక్లలో మామోగ్రఫీ యూనిట్ల ద్వారా మొత్తం ఏడు ఎమిరేట్స్లో ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్లను చేస్తున్నారు. జనవరి 20న ప్రారంభమైన ఈ సేవలు ఫిబ్రవరి 10తో ముగియనున్నవి. స్పెషల్ స్క్రీనింగ్ల మొబైల్ క్లినిక్లు, మినీవ్యాన్లు ఫిబ్రవరి 4న షార్జా, అజ్మాన్లలో ప్రారంభమై ఫిబ్రవరి 10న అబుధాబిలో తమ పర్యటనను ముగిస్తాయి.
రూట్ మ్యాప్
ఫిబ్రవరి 4న షార్జాలోని అల్ హీరా బీచ్లో ఉదయం 9 - 1 గంటల వరకు, అజ్మాన్లో అల్ జోరా బీచ్లో సాయంత్రం 4-10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 5న దుబాయ్లో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు గ్లోబల్ విలేజ్లో.. ఫిబ్రవరి 6 జీరో 6 మాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.. ఫిబ్రవరి 7న కైట్ బీచ్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొబైల్ క్లినిక్లు సేవలు అందిస్తాయి. ఫుజైరా కార్నిచ్లో ఫిబ్రవరి 8న మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.. రస్ అల్ ఖైమాలోని మినా అల్ అరబ్లో ఫిబ్రవరి 9న మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 7 వరకు.. అబుధాబి జాయెద్ స్పోర్ట్స్ సిటీలో ఫిబ్రవరి 10న సాయంత్రం 5 గంటల నుంచి సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







