120 గంటల తర్వాత చిన్నారిని రక్షించిన ఎమిరాటీ స్క్వాడ్
- February 11, 2023
యూఏఈ: టర్కీ, సిరియా భూకంపం బాధితులను ఆదుకునేందుకు యూఏఈ చేపట్టిన 'గాలంట్ నైట్/2' ఆపరేషన్ విజయవంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా టర్కీలో ఇద్దరు వ్యక్తులను ఎమిరాటీ సెర్చ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్లు రక్షించాయి. ఇద్దరిలో ఒకరు 11 ఏళ్ల పిల్లవాడు కాగా, రెండోవారు యాభై నుంచి అరవైల మధ్య వయసున్న వ్యక్తి. కహ్రామన్మారాస్ ప్రావిన్స్లోని దాదాపు 120 గంటలపాటు శిథిలాల మధ్య చిక్కుకున్న ఇద్దరు బాధితులను రక్షించేందుకు ఎమిరాటీ బృందం తీవ్రంగా శ్రమించిందని అధికారులు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వారికి వైద్య నిపుణులు విజయవంతంగా చికిత్స అందించారని, ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నారని ఎమిరాటీ స్క్వాడ్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







