120 గంటల తర్వాత చిన్నారిని రక్షించిన ఎమిరాటీ స్క్వాడ్
- February 11, 2023
యూఏఈ: టర్కీ, సిరియా భూకంపం బాధితులను ఆదుకునేందుకు యూఏఈ చేపట్టిన 'గాలంట్ నైట్/2' ఆపరేషన్ విజయవంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా టర్కీలో ఇద్దరు వ్యక్తులను ఎమిరాటీ సెర్చ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్లు రక్షించాయి. ఇద్దరిలో ఒకరు 11 ఏళ్ల పిల్లవాడు కాగా, రెండోవారు యాభై నుంచి అరవైల మధ్య వయసున్న వ్యక్తి. కహ్రామన్మారాస్ ప్రావిన్స్లోని దాదాపు 120 గంటలపాటు శిథిలాల మధ్య చిక్కుకున్న ఇద్దరు బాధితులను రక్షించేందుకు ఎమిరాటీ బృందం తీవ్రంగా శ్రమించిందని అధికారులు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వారికి వైద్య నిపుణులు విజయవంతంగా చికిత్స అందించారని, ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నారని ఎమిరాటీ స్క్వాడ్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







