ఒమన్లో 82% పెరిగిన హోటళ్ల ఆదాయం
- February 12, 2023
మస్కట్: 3 నుండి 5 నక్షత్రాల రేటింగ్ ఉన్న హోటళ్ల మొత్తం ఆదాయం 2022 డిసెంబర్ చివరి నాటికి 82.7 శాతం పెరిగి OMR185,772కు చేరింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ జారీ చేసిన నెలవారీ స్టాటిస్టికల్ బులెటిన్ ప్రకారం.. హోటల్లలోని అతిథుల సంఖ్య 2021లో ఇదే కాలంతో పోలిస్తే 2022 డిసెంబర్ చివరి వరకు 33.6 శాతం పెరిగింది. ఆక్యుపెన్సీ రేటు డిసెంబర్ 2022 చివరి వరకు 17.6 శాతం వృద్ధిని నమోదు చేసి 2021లో 38.3 శాతంతో పోలిస్తే 45 శాతానికి చేరుకుంది. అదే సమయంలో గల్ఫ్ అతిథుల సంఖ్య 304 శాతం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. డిసెంబర్ 2021 చివరి నాటికి 39,689 మంది నుండి 2022 డిసెంబర్ చివరి వరకు 160,340కి చేరుకుంది. యూరోపియన్ పర్యాటకుల సంఖ్య డిసెంబర్ 2021 చివరి నాటికి 105, 558 నుండి 360, 339కి పెరిగింది. డిసెంబర్ 2021 చివరి వరకు 241.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. అమెరికన్ పర్యాటకుల సంఖ్య విషయానికొస్తే, ఇది డిసెంబర్ 2022 చివరి వరకు 60,148 మందికి చేరింది. ఇది 2021లో ఇదే కాలంతో పోలిస్తే 165.4 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అయితే ఒమానీల సంఖ్య 14.1 శాతం తగ్గింది. డిసెంబర్ 2021 నాటికి వీరి సంఖ్య 814,518 ఉండగా.. డిసెంబర్ 2022కు 699,937కి పడిపోయింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







