‘దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, అబుధాబి ఫెరారీ వరల్డ్’లకే పర్యాటకుల ఓటు

- February 25, 2023 , by Maagulf
‘దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, అబుధాబి ఫెరారీ వరల్డ్’లకే పర్యాటకుల ఓటు

యూఏఈ: కొవిడ్ పాండమిక్ అనంతర కాలంలో యూఏఈ పర్యాటకులకు అందించే కార్యకలాపాలకు భారీ డిమాండ్‌ను నమోదు చేసిందని పర్యాటక పరిశ్రమ నిపుణులు తెలిపారు. "దుబాయ్‌లోని మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, అబుధాబిలోని ఫెరారీ వరల్డ్ యూఏఈలో అత్యధిక మంది పర్యాటకులు సందర్శించే జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. టిక్కెట్లు దాదాపు ప్రతిరోజూ అమ్ముడవుతున్నాయి." అని రైనా టూర్స్ సేల్స్ డైరెక్టర్ టిటో మథాచన్ అన్నారు.  పర్యాటక పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డెసర్ట్ సఫారీ, హెలికాప్టర్ రైడ్ వంటి సాహస కార్యకలాపాలను పర్యాటకులు ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇలాంటి కార్యకలాపాలను ప్రయత్నించే పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. రూహ్ ట్రావెల్ అండ్ టూరిజం సేల్స్ డైరెక్టర్ లిబిన్ వర్గీస్ మాట్లాడుతూ.. దుబాయ్ స్వింగ్, దుబాయ్ స్కై డైవ్, హట్టా జిప్‌లైన్, స్లెడ్జ్ మరెన్నో వాటికి పర్యాటకుల తాకిడి అధికంగా ఉందన్నారు. దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్, మిరాకిల్ గార్డెన్స్ వంటి ఆకర్షణలు అన్ని విభాగాలలో అగ్రస్థానంలో ఉన్నాయని వర్గీస్ చెప్పారు. ‘‘మరొక ఇన్-డిమాండ్ యాక్టివిటీ క్రూయిజ్ టూర్. పెద్ద నౌకలు దుబాయ్ నుండి అబుధాబికి పర్యాటకులను రెండు రాత్రులు, మూడు పగళ్లు గడపడానికి తీసుకువెళతాయి. ”అని వర్గీస్ చెప్పారు. మెరీనా యాచ్ కు కూడా పర్యాటకులు అధికంగా వస్తారని తెలిపారు. ప్రపంచంలోని ఇతర నగరాలతో పోలిస్తే దుబాయ్‌లో పార్టీలు, ఏవైనా వేడుకల నిర్వాహణ చాలా తక్కువని వర్గీస్ వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com