యూఏఈ వీసా నిబంధనల్లో మార్పులు: ఇకపై బంధువుల స్పాన్సర్కు కనీస జీతం Dh10,000
- March 01, 2023
యూఏఈ: నివాస వీసా నియమాలలో యూఏఈ మార్పులు చేసింది. నివాస వీసాపై ఐదుగురు బంధువులను స్పాన్సర్ చేయాలనుకునే యూఏఈ ప్రవాసులు తప్పనిసరిగా కనీస నెలవారీ జీతం Dh10,000 కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అక్టోబరు 3, 2022న అమలు చేయబడిన కేబినెట్ తీర్మానం నెం. 65 షరతులు, నియంత్రణలకు సంబంధించి ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ చైర్మన్ అలీ మొహమ్మద్ అల్ షమ్సీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని విడుదల చేశారు. అదే విధంగా ప్రవాస స్పాన్సర్లు బంధువుల నివాసానికి తగిన గృహాలను కలిగి ఉండాలి. ఆరుగురు బంధువులను స్పాన్సర్ చేయాలనుకుంటున్న వారికి కనీసం Dh15,000 కంటే ఎక్కువ జీతం ఉండాలి. డైరెక్టర్ జనరల్ 6 కంటే ఎక్కువ మంది బంధువుల స్పాన్సర్ కోసం వచ్చిన దరఖాస్తులను సమీక్షిస్తారని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









