షార్జాలో ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు
- March 03, 2023
యూఏఈ: షార్జాలో ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపును ప్రకటించారు. షార్జాలో జారీ చేయబడిన ట్రాఫిక్ జరిమానాలపై వాహనదారులు 50 శాతం తగ్గింపును పొందవచ్చని షార్జా పోలీస్లోని ట్రాఫిక్, పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్-కల్నల్ ముహమ్మద్ అలై తెలిపారు. ట్రాఫిక్ జరిమానా జరిమానాలను సగానికి తగ్గించడంతో పాటు, మార్చి 31 లోపు ఉల్లంఘనలకు సంబంధించిన ఇంప్యూండ్మెంట్ ఆర్డర్లు, బ్లాక్ పాయింట్లు రద్దు చేయబడతాయని వాహనదారులు ఒక నెలపాటు ఈ తగ్గింపును పొందవచ్చని పేర్కొన్నారు. ఈ వారం ప్రారంభంలో షార్జా ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుందని తెలిపారు. ఉల్లంఘనకు పాల్పడిన తేదీ నుండి 60 రోజులలోపు జరిమానా చెల్లించినట్లయితే వాహనదారులు 35 శాతం తగ్గింపును పొందుతారని, ఉల్లంఘించిన 60 రోజుల నుంచి ఏడాదిలోపు జరిమానా చెల్లిస్తే వాహనదారులకు 25 శాతం రాయితీ లభిస్తుందని ముహమ్మద్ అలై తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!