ఒమన్కి చెందిన సలామ్ఎయిర్ విమానం.. భారత్లో అత్యవసరంగా ల్యాండింగ్
- March 03, 2023
మస్కట్: బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ నుంచి మస్కట్కు బయలుదేరిన సలామ్ఎయిర్ విమానంలో పొగలు రావడంతో మహారాష్ట్రలోని నాగ్పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు ఒమన్కు చెందిన సలామ్ఎయిర్ సుల్తానేట్ తెలిపింది. "చాటోగ్రామ్ (చిట్టగాంగ్) నుండి మస్కట్ వెళ్లే సలామ్ ఎయిర్ విమానంలో కార్గో హోల్డ్లో పొగ ఉన్నట్లు గుర్తించిన అలారం కారణంగా సాంకేతిక సమస్య తలెత్తింది. ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని నాగ్పూర్ విమానాశ్రయానికి మళ్లించారు. వెంటనే ఎమర్జెన్సీ, ఇంజినీరింగ్ బృందం ద్వారా విమానాన్ని తనిఖీ చేశారు. మంటలను గుర్తించలేదు. విమానం నాగ్పూర్ విమానాశ్రయం నుండి బయలుదేరింది. ప్రయాణీకులు, సిబ్బంది అందరూ మస్కట్ విమానాశ్రయానికి తిరిగి వచ్చారు." అని సలామ్ఎయిర్ తన ప్రకటనలో వెల్లడించింది. బంగ్లాదేశ్ నుంచి బయలుదేరిన విమానంలో దాదాపు 200 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









