ఒమన్కి చెందిన సలామ్ఎయిర్ విమానం.. భారత్లో అత్యవసరంగా ల్యాండింగ్
- March 03, 2023
మస్కట్: బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ నుంచి మస్కట్కు బయలుదేరిన సలామ్ఎయిర్ విమానంలో పొగలు రావడంతో మహారాష్ట్రలోని నాగ్పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు ఒమన్కు చెందిన సలామ్ఎయిర్ సుల్తానేట్ తెలిపింది. "చాటోగ్రామ్ (చిట్టగాంగ్) నుండి మస్కట్ వెళ్లే సలామ్ ఎయిర్ విమానంలో కార్గో హోల్డ్లో పొగ ఉన్నట్లు గుర్తించిన అలారం కారణంగా సాంకేతిక సమస్య తలెత్తింది. ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని నాగ్పూర్ విమానాశ్రయానికి మళ్లించారు. వెంటనే ఎమర్జెన్సీ, ఇంజినీరింగ్ బృందం ద్వారా విమానాన్ని తనిఖీ చేశారు. మంటలను గుర్తించలేదు. విమానం నాగ్పూర్ విమానాశ్రయం నుండి బయలుదేరింది. ప్రయాణీకులు, సిబ్బంది అందరూ మస్కట్ విమానాశ్రయానికి తిరిగి వచ్చారు." అని సలామ్ఎయిర్ తన ప్రకటనలో వెల్లడించింది. బంగ్లాదేశ్ నుంచి బయలుదేరిన విమానంలో దాదాపు 200 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







