ఒమన్‌కి చెందిన సలామ్‌ఎయిర్‌ విమానం.. భారత్‌లో అత్యవసరంగా ల్యాండింగ్

- March 03, 2023 , by Maagulf
ఒమన్‌కి చెందిన సలామ్‌ఎయిర్‌ విమానం.. భారత్‌లో అత్యవసరంగా ల్యాండింగ్

మస్కట్‌: బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ నుంచి మస్కట్‌కు బయలుదేరిన సలామ్‌ఎయిర్‌ విమానంలో పొగలు రావడంతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేసినట్లు ఒమన్‌కు చెందిన సలామ్‌ఎయిర్‌ సుల్తానేట్‌ తెలిపింది. "చాటోగ్రామ్ (చిట్టగాంగ్) నుండి మస్కట్ వెళ్లే సలామ్ ఎయిర్ విమానంలో కార్గో హోల్డ్‌లో పొగ ఉన్నట్లు గుర్తించిన అలారం కారణంగా సాంకేతిక సమస్య తలెత్తింది. ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని నాగ్‌పూర్ విమానాశ్రయానికి మళ్లించారు. వెంటనే ఎమర్జెన్సీ, ఇంజినీరింగ్ బృందం ద్వారా విమానాన్ని తనిఖీ చేశారు. మంటలను గుర్తించలేదు. విమానం నాగ్‌పూర్ విమానాశ్రయం నుండి బయలుదేరింది. ప్రయాణీకులు, సిబ్బంది అందరూ మస్కట్ విమానాశ్రయానికి తిరిగి వచ్చారు." అని సలామ్‌ఎయిర్ తన ప్రకటనలో వెల్లడించింది. బంగ్లాదేశ్ నుంచి బయలుదేరిన విమానంలో దాదాపు 200 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com