అక్టోబర్ వద్దు బాబోయ్ అంటున్న మహేష్ ఫ్యాన్స్.!

- March 24, 2023 , by Maagulf
అక్టోబర్ వద్దు బాబోయ్ అంటున్న మహేష్ ఫ్యాన్స్.!

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందనీ సమాచారం. 

కాగా, ఈ సినిమాని ఎలాగైనా అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే, మహేష్ బాబుకి అక్టోబర్ అంతగా కలిసొచ్చినట్లు లేదు. గతంలో పేద్ద ఫెయిల్యూర్ ట్రాకే వుంది అక్టోబర్‌తో మహేష్ బాబుకి. 

ఆ సెంటిమెంట్‌తోనే అక్టోబర్ రిలీజ్ వద్దని ఫ్యాన్స్ సూచిస్తున్నారట. మరోవైపు మహేష్ బాబు కూడా అక్టోబర్ రిలీజ్ పట్ల అంత సుముఖంగా వున్నట్లు కనిపించడం లేదు. 

పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల మరో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ అండ్ డిఫరెంట్ లుక్స్‌లో మహేష్ బాబు ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడు ఈ సినిమాతో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com