అక్టోబర్ వద్దు బాబోయ్ అంటున్న మహేష్ ఫ్యాన్స్.!
- March 24, 2023
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందనీ సమాచారం.
కాగా, ఈ సినిమాని ఎలాగైనా అక్టోబర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే, మహేష్ బాబుకి అక్టోబర్ అంతగా కలిసొచ్చినట్లు లేదు. గతంలో పేద్ద ఫెయిల్యూర్ ట్రాకే వుంది అక్టోబర్తో మహేష్ బాబుకి.
ఆ సెంటిమెంట్తోనే అక్టోబర్ రిలీజ్ వద్దని ఫ్యాన్స్ సూచిస్తున్నారట. మరోవైపు మహేష్ బాబు కూడా అక్టోబర్ రిలీజ్ పట్ల అంత సుముఖంగా వున్నట్లు కనిపించడం లేదు.
పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల మరో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ అండ్ డిఫరెంట్ లుక్స్లో మహేష్ బాబు ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు ఈ సినిమాతో.
తాజా వార్తలు
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!







