పౌర విమానయాన రంగంలో ఖతార్ మరో ఘనత
- March 25, 2023
దోహా: అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ICAO) నిర్దేశాల అమలులో దోహా ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్, ఖతార్ గగనతలాన్ని పూర్తిగా నిర్వహించడం ప్రారంభించిందని ఖతార్లోని సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) ప్రకటించింది. దోహా ఎఫ్ఐఆర్ స్కైస్ను పూర్తిగా నేల స్థాయి నుండి అంతర్జాతీయ జలాల్లోని కొన్ని ప్రాంతాలను నిర్వహించే మొదటి దశ పూర్తయినట్లు వెల్లడించింది. CAA ప్రకారం..ICAO చారిత్రాత్మక నిర్ణయం ఖతార్ రాష్ట్రాన్ని తన గగనతలాన్ని నిర్వహించడానికి, దోహా ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ను స్థాపించడానికి అనుమతించడంపై ఖతార్ రవాణా మంత్రి HE జాసిమ్ బిన్ సైఫ్ అల్-సులైతి హర్షం వ్యక్తం చేశారు. ఖతార్లోని పౌర విమానయాన వ్యవస్థకు అంతర్జాతీయ విశ్వాసానికి ఇదే తిరుగులేని సాక్ష్యమని పేర్కొన్నారు. గత సంవత్సరం మార్చిలో రవాణా మంత్రిత్వ శాఖ ICAO కౌన్సిల్ దోహా ఎఫ్ఐఆర్ ఏర్పాటుకు అంగీకరించిందని గుర్తు చేశారు. దోహా ఎఫ్ఐఆర్ మొదటి దశ అమలులో ఖతార్ కొత్త విమాన మార్గాలను చూస్తుందని, గగనతలంలో ఉన్నప్పుడు ఎయిర్క్రాఫ్ట్ వెయిటింగ్ ఏరియా సామర్థ్యం పెంచుతుందని గతేడాది ఈ సందర్భంగా హెచ్ఈ జస్సిమ్ బిన్ సైఫ్ అల్-సులైతి అన్నారు. పెద్ద ఎయిర్ ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ఖతార్ గగనతలంలో ముఖ్యమైన విమాన మార్గాల సంఖ్యలో పెరుగుదలను కూడా చూడవచ్చని అల్-సులైతి వివరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ







