ఫీ చెల్లించకుండానే ప్రవాసులకు ఔషధాల విక్రయం!
- March 25, 2023కువైట్: కువైట్ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రవాసులకు నిర్ణీత KD 5 రుసుము చెల్లించకుండానే ఆసుపత్రులు, క్లినిక్లలో ఔషధాలను విక్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక కొత్త నివేదికను ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధికి సమర్పించినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. నిర్ణీత రుసుము అమలులోకి వచ్చిన తర్వాత మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో ఔషధాల వినియోగం గణనీయంగా తగ్గింది. అయితే ఔషధ వ్యర్థాలను పర్యవేక్షించే విధానాలకు మెడికల్ స్టోర్స్తో పాటు ప్రభుత్వ ఫార్మసీల వద్ద కఠిన నియంత్రణ అవసరమని సంబంధిత వర్గాలు అభిప్రాయపడినట్లు నివేదికలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు