ఖతార్లో వింటర్ క్యాంపింగ్ సీజన్ ఏప్రిల్ 29 వరకు పొడిగింపు
- March 26, 2023
దోహా: దేశంలో ప్రస్తుత క్యాంపింగ్ సీజన్ను ఏప్రిల్ 29 వరకు పొడిగించనున్నట్లు పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో దక్షిణ ప్రాంతాలలో (సీలైన్, ఖోర్ అల్ ఉదీద్) క్యాంపింగ్ మే 20 వరకు కొనసాగుతుందని తెలిపింది. మంత్రిత్వ శాఖ యొక్క వింటర్ క్యాంపింగ్ వ్యవహారాల కమిటీ దేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాలలో ప్రస్తుత సీజన్లో క్యాంపింగ్ వ్యవధిని ఏప్రిల్ 1కి బదులుగా ఏప్రిల్ 29 వరకు పొడిగించాలని నిర్ణయించింది. పర్యావరణం, వాతావరణ మార్పుల మంత్రి హిస్ ఎక్సలెన్సీ షేక్ డాక్టర్ ఫలేహ్ బిన్ నాసర్ అల్ థానీ ఆదేశాల మేరకు ఇది ఆధారపడి ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొక్కలు, చెట్లను నాటడం, క్యాంపింగ్ సైట్లను నిర్వహించడం, క్యాంపింగ్కు సంబంధించిన నియంత్రణలు- షరతులకు కట్టుబడి ఉండటం ద్వారా పర్యావరణాన్ని సంరక్షించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







