ఖైరాన్లో నీటమునిగి ఇద్దరు భారతీయులు మృతి
- March 26, 2023కువైట్: ఖైరాన్లో ఇద్దరు భారతీయులు నీటిలో మునిగి చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు ఖైరాన్ ప్రాంతంలో కయాకింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో వారు మరణించారు. మృతులు కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన సుకేష్, పతనంతిట్టకు చెందిన జోసెఫ్ మత్తాయి (టిజో)గా గుర్తించారు. ఈ విషాదకర సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. వారిద్దరూ లులు ఎక్స్ఛేంజ్ కువైట్లో పనిచేస్తున్నారు. 44 ఏళ్ల సుకేష్ కార్పొరేట్ మేనేజర్గా పని చేస్తుండగా.. 29 ఏళ్ల టిజో అసిస్టెంట్ అకౌంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..