రమదాన్: మోసపూరిత ఫిషింగ్ ప్రచారాలపై NCSA హెచ్చరిక
- March 27, 2023దోహా: పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా నకిలీ పెట్టుబడి , రాయితీలు ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్నాయని, వీటి ముసుగులో మోసపూరిత ఫిషింగ్ ప్రమాదాలు పొంచిఉన్నాయని ఖతార్లోని నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) హెచ్చరించింది. కొన్ని నకిలీ ప్రచారాలు అనేక జాతీయ ఖతార్ సంస్థల వలె కనిపిస్తాయని, ఈ ప్రచారాలకు స్పందించవద్దని, వారు సూచించిన లింక్ లను ఓపెన్ చేయొద్దని NCSA హెచ్చరించింది. సాధారణంగా ఫిషింగ్ ప్రచారాల కోసం సైబర్ మోసగాళ్లు ఉచిత, ఓపెన్ సోర్స్ "Wordpress" వ్యవస్థను కూడా ఉపయోగిస్తాయని తెలిపింది. వాటిని అధికారిక సంస్థలు ఉపయోగించవని గుర్తించాలన్నారు. సైబర్ మోసగాళ్లు వ్యక్తిగత బ్యాంకింగ్ డేటాను అడుగుతారని, ఆర్థిక పెట్టుబడి - తగ్గింపు ఆఫర్ల ద్వారా ప్రజలను ఆకర్షించడానికి ప్రకటనలు ఇస్తారని తెలిపారు. ఖతార్లోని అధికారిక అధికారులు దరఖాస్తుదారుల నుండి వ్యక్తిగత డేటాను అభ్యర్థించరని, అన్ని అధికారిక లావాదేవీలు "హుకూమి" ప్లాట్ఫారమ్ లేదా జాతీయ డాక్యుమెంటేషన్ ప్లాట్ఫారమ్ ద్వారా నిర్వహించబడతాయని NCSA గుర్తు చేసింది.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం