విద్యార్థులకు ప్రారంభమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్
- March 28, 2023కువైట్: షేఖా ఫాడియా అల్-సాద్ అల్-సబాహ్ సైంటిఫిక్ కాంపిటీషన్లో పాల్గొనే మిడిల్, హైస్కూల్ విద్యార్థుల కోసం ఫీల్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను అల్-సాద్ ఫౌండేషన్ ఫర్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా కువైట్లోని GE టెక్నాలజీ సెంటర్కు విద్యార్థులు ఫీల్డ్ విజిట్ కు వెళ్లారు. సైంటిఫిక్ ప్రాజెక్ట్లను అమలు చేసే విధానం గురించి GE నిపుణులతో సంభాషించి సాంకేతిక నైపుణ్యం, నైపుణ్యాలను పొందడం ఈ పర్యటన లక్ష్యం అని కాంపిటీషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఐషా అల్-హోలీ తెలిపారు. ఫీల్డ్ విజిట్లు విద్యార్థుల్లో ఆవిష్కరణలు, శాస్త్రీయ, సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి దోహదపడుతుందని అన్నారు. 'న్యూ కువైట్ 2035' విజన్ని సాధించడానికి పౌర సమాజ సంస్థలు, ప్రైవేట్ రంగాల మధ్య సహకారం ప్రాముఖ్యతను వివరించారు. షేఖా ఫాడియా అల్-సాద్ అల్-సబాహ్ సైంటిఫిక్ కాంపిటీషన్తో సహకారం మరింత మంది బాలికలు, మహిళలను సైన్స్, టెక్నాలజీ మరియు ఇంజినీరింగ్ రంగాలకు ఆకర్షించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సెంటర్ డైరెక్టర్ జనరల్ అల్-రషీద్ తెలిపారు.
తాజా వార్తలు
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్