విద్యార్థులకు ప్రారంభమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్
- March 28, 2023
కువైట్: షేఖా ఫాడియా అల్-సాద్ అల్-సబాహ్ సైంటిఫిక్ కాంపిటీషన్లో పాల్గొనే మిడిల్, హైస్కూల్ విద్యార్థుల కోసం ఫీల్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను అల్-సాద్ ఫౌండేషన్ ఫర్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా కువైట్లోని GE టెక్నాలజీ సెంటర్కు విద్యార్థులు ఫీల్డ్ విజిట్ కు వెళ్లారు. సైంటిఫిక్ ప్రాజెక్ట్లను అమలు చేసే విధానం గురించి GE నిపుణులతో సంభాషించి సాంకేతిక నైపుణ్యం, నైపుణ్యాలను పొందడం ఈ పర్యటన లక్ష్యం అని కాంపిటీషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఐషా అల్-హోలీ తెలిపారు. ఫీల్డ్ విజిట్లు విద్యార్థుల్లో ఆవిష్కరణలు, శాస్త్రీయ, సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి దోహదపడుతుందని అన్నారు. 'న్యూ కువైట్ 2035' విజన్ని సాధించడానికి పౌర సమాజ సంస్థలు, ప్రైవేట్ రంగాల మధ్య సహకారం ప్రాముఖ్యతను వివరించారు. షేఖా ఫాడియా అల్-సాద్ అల్-సబాహ్ సైంటిఫిక్ కాంపిటీషన్తో సహకారం మరింత మంది బాలికలు, మహిళలను సైన్స్, టెక్నాలజీ మరియు ఇంజినీరింగ్ రంగాలకు ఆకర్షించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సెంటర్ డైరెక్టర్ జనరల్ అల్-రషీద్ తెలిపారు.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







