రూ.22.39 కోట్ల భారీ విరాళం ప్రకటించిన లూలూ గ్రూపు ఛైర్మన్ యూసఫ్ అలీ
- March 29, 2023
అబుధాబి: లూలూ గ్రూపు ఛైర్మన్ ఎం.ఏ యూసఫ్ అలీ తన ఉదారత చాటుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూఏఈలో నిర్వహిస్తున్న 'వన్ బిలియన్ మీల్స్' అనే ప్రచార కార్యక్రమానికి 1కోటి దిర్హాములు విరాళం ప్రకటించారు.కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద రమదాన్ స్థిరమైన ఆహార సహాయ నిధిని ప్రారంభించాలనే లక్ష్యంతో యూఏఈ ఈ 'వన్ బిలియన్ మీల్స్' ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఈ సందర్భంగా యూసఫ్ అలీ మాట్లాడుతూ.. ఎండోమెంట్ క్యాంపెయిన్కు విరాళం ఇవ్వడం అనేది దాతృత్వానికి ప్రపంచ కేంద్రంగా యూఏఈ స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి తన నిబద్ధతగా పేర్కొన్నారు.మానవతావాద పనుల్లో యూఏఈ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు. అలాగే 'వన్ బిలియన్ మీల్స్' సహాయ నిధి కార్యక్రమానికి సహకరించడం ద్వారా పేదలకు సహాయం చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక ప్రపంచంలోని పేదలకు సహాయం చేయడానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ ప్రచారాన్ని ప్రకటించడం జరిగింది. దాంతో దీనికి భారీ మొత్తం విరాళాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!