రూ.22.39 కోట్ల భారీ విరాళం ప్రకటించిన లూలూ గ్రూపు ఛైర్మన్ యూసఫ్ అలీ
- March 29, 2023
అబుధాబి: లూలూ గ్రూపు ఛైర్మన్ ఎం.ఏ యూసఫ్ అలీ తన ఉదారత చాటుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూఏఈలో నిర్వహిస్తున్న 'వన్ బిలియన్ మీల్స్' అనే ప్రచార కార్యక్రమానికి 1కోటి దిర్హాములు విరాళం ప్రకటించారు.కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద రమదాన్ స్థిరమైన ఆహార సహాయ నిధిని ప్రారంభించాలనే లక్ష్యంతో యూఏఈ ఈ 'వన్ బిలియన్ మీల్స్' ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఈ సందర్భంగా యూసఫ్ అలీ మాట్లాడుతూ.. ఎండోమెంట్ క్యాంపెయిన్కు విరాళం ఇవ్వడం అనేది దాతృత్వానికి ప్రపంచ కేంద్రంగా యూఏఈ స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి తన నిబద్ధతగా పేర్కొన్నారు.మానవతావాద పనుల్లో యూఏఈ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు. అలాగే 'వన్ బిలియన్ మీల్స్' సహాయ నిధి కార్యక్రమానికి సహకరించడం ద్వారా పేదలకు సహాయం చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక ప్రపంచంలోని పేదలకు సహాయం చేయడానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ ప్రచారాన్ని ప్రకటించడం జరిగింది. దాంతో దీనికి భారీ మొత్తం విరాళాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









