ఆ రహదారిపై స్లోగా డ్రైవింగ్ చేస్తే.. Dh400 జరిమానా
- March 31, 2023
యూఏఈ: ఏప్రిల్ నుండి అబుధాబి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ రోడ్లో కనిష్టంగా 120kmph వేగాన్ని అమలు చేయనుంది. మే 1 నుండి ఈ నిబంధన ఉల్లంఘించినవారికి Dh400 జరిమానా విధించబడుతుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రధాన రహదారిపై గరిష్ట వేగం గంటకు 140కిమీగా ఉంటుందని, ఎడమవైపు నుండి మొదటి, రెండవ లేన్లలో కనిష్టంగా 120కిమీ వేగం వర్తిస్తుందని అబుధాబి పోలీసు అధికారులు వివరించారు. కనీస వేగం పేర్కొనబడని మూడవ లేన్లో నెమ్మదైన వాహనాలను అనుమతించబడుతుందని పేర్కొన్నారు. రోడ్డు చివరి లేన్ను ఉపయోగించాల్సిన భారీ వాహనాలు కనీస వేగ నియమానికి లోబడి ఉండవని పోలీసులు చెప్పారు. ఏప్రిల్లో ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత నిర్దేశించిన లేన్లలో గంటకు 120కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో డ్రైవింగ్ చేస్తే పట్టుబడిన వారికి హెచ్చరిక నోటీసులు జారీ చేయబడతాయని, ఆ తర్వాత మే 1న 400 దిర్హామ్ల జరిమానా వర్తిస్తుందని సెంట్రల్ ఆపరేషన్స్ సెక్టార్ డైరెక్టర్ మేజర్-జనరల్ అహ్మద్ సైఫ్ బిన్ జైటూన్ అల్ ముహైరి తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం









