ఆ రహదారిపై స్లోగా డ్రైవింగ్ చేస్తే.. Dh400 జరిమానా
- March 31, 2023
యూఏఈ: ఏప్రిల్ నుండి అబుధాబి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ రోడ్లో కనిష్టంగా 120kmph వేగాన్ని అమలు చేయనుంది. మే 1 నుండి ఈ నిబంధన ఉల్లంఘించినవారికి Dh400 జరిమానా విధించబడుతుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రధాన రహదారిపై గరిష్ట వేగం గంటకు 140కిమీగా ఉంటుందని, ఎడమవైపు నుండి మొదటి, రెండవ లేన్లలో కనిష్టంగా 120కిమీ వేగం వర్తిస్తుందని అబుధాబి పోలీసు అధికారులు వివరించారు. కనీస వేగం పేర్కొనబడని మూడవ లేన్లో నెమ్మదైన వాహనాలను అనుమతించబడుతుందని పేర్కొన్నారు. రోడ్డు చివరి లేన్ను ఉపయోగించాల్సిన భారీ వాహనాలు కనీస వేగ నియమానికి లోబడి ఉండవని పోలీసులు చెప్పారు. ఏప్రిల్లో ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత నిర్దేశించిన లేన్లలో గంటకు 120కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో డ్రైవింగ్ చేస్తే పట్టుబడిన వారికి హెచ్చరిక నోటీసులు జారీ చేయబడతాయని, ఆ తర్వాత మే 1న 400 దిర్హామ్ల జరిమానా వర్తిస్తుందని సెంట్రల్ ఆపరేషన్స్ సెక్టార్ డైరెక్టర్ మేజర్-జనరల్ అహ్మద్ సైఫ్ బిన్ జైటూన్ అల్ ముహైరి తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







