ఆ రహదారిపై స్లోగా డ్రైవింగ్ చేస్తే.. Dh400 జరిమానా
- March 31, 2023
యూఏఈ: ఏప్రిల్ నుండి అబుధాబి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ రోడ్లో కనిష్టంగా 120kmph వేగాన్ని అమలు చేయనుంది. మే 1 నుండి ఈ నిబంధన ఉల్లంఘించినవారికి Dh400 జరిమానా విధించబడుతుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రధాన రహదారిపై గరిష్ట వేగం గంటకు 140కిమీగా ఉంటుందని, ఎడమవైపు నుండి మొదటి, రెండవ లేన్లలో కనిష్టంగా 120కిమీ వేగం వర్తిస్తుందని అబుధాబి పోలీసు అధికారులు వివరించారు. కనీస వేగం పేర్కొనబడని మూడవ లేన్లో నెమ్మదైన వాహనాలను అనుమతించబడుతుందని పేర్కొన్నారు. రోడ్డు చివరి లేన్ను ఉపయోగించాల్సిన భారీ వాహనాలు కనీస వేగ నియమానికి లోబడి ఉండవని పోలీసులు చెప్పారు. ఏప్రిల్లో ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత నిర్దేశించిన లేన్లలో గంటకు 120కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో డ్రైవింగ్ చేస్తే పట్టుబడిన వారికి హెచ్చరిక నోటీసులు జారీ చేయబడతాయని, ఆ తర్వాత మే 1న 400 దిర్హామ్ల జరిమానా వర్తిస్తుందని సెంట్రల్ ఆపరేషన్స్ సెక్టార్ డైరెక్టర్ మేజర్-జనరల్ అహ్మద్ సైఫ్ బిన్ జైటూన్ అల్ ముహైరి తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







