పదో తరగతి విద్యార్థులకు శుభవార్త తెలిపిన APSRTC
- April 02, 2023
అమరావతి: APSRTC పదో తరగతి విద్యార్థులకు శుభవార్త తెలిపింది. పదో తరగతి ఫైనల్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. విద్యార్థులు తమ వద్దనున్న హాల్ టికెట్ చూపించి పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ప్రయాణించొచ్చని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పరీక్షలు జరిగినన్ని రోజులూ ఈ వెసులుబాటు ఉండనుంది.
ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 3,348 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు 6.64 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బస్సుల కోసం విద్యార్థులు ఇక్కట్లు పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. బస్సు రవాణా లేని చోట విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే డీఈఓ ద్వారా ఆర్టీసీకి విఙప్తి చేస్తే ప్రత్యేకంగా బస్సు సదుపాయం కల్పిస్తామని వివరించారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









