షార్జాలో ట్రాఫిక్ జరిమానాలపై 35% వరకు తగ్గింపు
- April 02, 2023
యూఏఈ: వాహనదారులకు షార్జా బంపరాఫర్ ఇచ్చింది. వాహనదారులు జరిమానాలను ముందుగానే క్లియర్ చేస్తే ట్రాఫిక్ జరిమానాలపై 35 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మంగళవారం జరిగిన షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ పథకం ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది. జరిమానా జారీ అయిన తేదీ నుండి 60 రోజులలోపు జరిమానా చెల్లించినట్లయితే వాహనదారులు 35 శాతం తగ్గింపును పొందుతారు. ఉల్లంఘించిన 60 రోజుల నుంచి ఏడాదిలోపు జరిమానా చెల్లిస్తే వాహనదారులకు 25 శాతం రాయితీ లభిస్తుంది. కాగా, ఈ తగ్గింపు జరిమానా మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది. జప్తు రుసుము, ఏదైనా ఇతర జరిమానా ఉంటే పూర్తిగా చెల్లించవలసి ఉంటుంది. ట్రాఫిక్ నేరం చేసిన సంవత్సరం తర్వాత చెల్లించినట్లయితే జరిమానాలు లేదా రుసుములపై ఎలాంటి రాయితీలు వర్తించవని షార్జా తెలిపింది.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







