మద్యం తయారీ యూనిట్ నడుపుతున్న దంపతుల అరెస్ట్
- April 05, 2023
కువైట్: మద్యం తయారీ యూనిట్ నడుపుతున్న ఆసియాకు చెందిన దంపతులను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మదీ సెక్యూరిటీ డైరెక్టరేట్ వివరాల ప్రకారం.. ఆసియాకు చెందిన ఒక వివాహిత జంట మద్యం తయారీని చేపట్టారని, అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్నారని, విశ్వసనీయ సమాచారం అందడంతో దంపతులు నడుపుతున్న మద్యం తయారీ స్థలంపై డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడి నుంచి మద్యం తయారీకి వినియోగించే పదార్థలతోపాటు అప్పటికే తయారు చేసి అమ్మేందుకు సిద్ధంగా ఉన్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆసియా జంటను అరెస్టు చేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం అధికారులకు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. నివేదికల ప్రకారం గత 24 గంటల్లో ఇలాంటి ఘటన ఇది రెండోది కావడం గమనార్హం.
తాజా వార్తలు
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!







