మద్యం తయారీ యూనిట్ నడుపుతున్న దంపతుల అరెస్ట్
- April 05, 2023
కువైట్: మద్యం తయారీ యూనిట్ నడుపుతున్న ఆసియాకు చెందిన దంపతులను కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మదీ సెక్యూరిటీ డైరెక్టరేట్ వివరాల ప్రకారం.. ఆసియాకు చెందిన ఒక వివాహిత జంట మద్యం తయారీని చేపట్టారని, అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్నారని, విశ్వసనీయ సమాచారం అందడంతో దంపతులు నడుపుతున్న మద్యం తయారీ స్థలంపై డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడి నుంచి మద్యం తయారీకి వినియోగించే పదార్థలతోపాటు అప్పటికే తయారు చేసి అమ్మేందుకు సిద్ధంగా ఉన్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆసియా జంటను అరెస్టు చేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం అధికారులకు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. నివేదికల ప్రకారం గత 24 గంటల్లో ఇలాంటి ఘటన ఇది రెండోది కావడం గమనార్హం.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







